తిందాం రండి.. భీమాళి తాండ్ర
భీమాళి.. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది మామిడి తాండ్ర. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తయారు చేస్తున్నా ఇక్కడి రుచికి అవి సాటిరావంటే నమ్మశక్యం కాదేమో.
న్యూస్టుడే, ఎల్.కోట, కొత్తవలస
భీమాళి.. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది మామిడి తాండ్ర. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తయారు చేస్తున్నా ఇక్కడి రుచికి అవి సాటిరావంటే నమ్మశక్యం కాదేమో. ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి సిద్ధంగా తయారు చేయడం ఈ గ్రామస్థుల ప్రత్యేకత. మామిడి గుజ్జు, పంచదార మాత్రమే ఉపయోగించి మిశ్రమాన్ని చాపలపై వేసి ఎండలో ఆరబెట్టి సంప్రదాయబద్ధంగా పొరలు వేస్తారు. రెండున్నర ఇంచీల దళసరి ఉండే ఒక్కో అచ్చులో 180 వరకు పొరలుంటాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజన్ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా పసుపుమయంగా మారింది.
ఏప్రిల్లో మొదలై..
గ్రామంలో దాదాపు 80 శాతం కుటుంబాలకు ఇదే జీవనాధారం. ఏటా ఏప్రిల్లో మొదలు పెట్టి జూన్ వరకు కొనసాగిస్తారు. కర్రలతో చిన్నపాటి పందిళ్లు వేసి దానిపై తాటాకు చాపలు పరుస్తారు. కలెక్టర్, కోలంగోవా, ఇతర రసాల నుంచి జ్యూస్ తీసి, దానికి పంచదార కలిపి చాపలపై చేతులతో రాస్తారు. అలా పొరలు ఏర్పడతాయి. రోజుకు ఆరుసార్లు చొప్పున నెల పాటు 180 దఫాలు జ్యూస్ను
పోస్తారు.
అంట్లు నుంచి తయారీ వరకు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం నుంచి కొన్ని కుటుంబాలవారు భీమాళికి వలస వచ్చారు. మొదట మామిడికాయల టెంకల నుంచి అంట్లు కట్టి మొక్కలు విక్రయించేవారు. క్రమంగా ఈ అమ్మకాలతో పాటు తాండ్ర తయారీపై దృష్టిసారించారు. రానురానూ అదే వారి జీవనాధారమైంది. ఆదాయం బాగుండడంతో గ్రామమంతా ఏటా అదే పనిలో నిమగ్నమయ్యేది. ఇలా ఏభై ఏళ్లుగా ప్రక్రియ సాగుతోంది. కొత్తవలస మండలం చినరావుపల్లి, జామి మండలం అలమండలోనూ తయారీదారులున్నారు. ప్రస్తుతం మొక్కల తయారీ ఆగిపోయింది.
ఇతర ప్రాంతాలకు..
ప్యాకింగ్ చేశాక.. ఉత్తరాంధ్రలోని జిల్లాలతో పాటు విజయవాడ, బరంపురం, హైదరాబాద్, కోల్కత్తా.. తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. తక్కువ మొత్తంలో తయారు చేసేవారు స్థానికంగానే విక్రయిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తిదారుల వద్ద హోల్సేల్గా కిలో రూ.120 ఉండగా.. బయట మార్కెట్లో రూ.150కిపైగా పలుకుతోంది.
సోలార్ శీతల గిడ్డంగి..
గతేడాది అలమండ ప్రాంతంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శ్రీపరదేశమ్మ తల్లి మామిడి ఉత్పత్తిదారుల సహాయ సహకార పరపతి సంఘం సహకారంతో 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన సోలార్ శీతల గిడ్డంగిని ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు రూ.25 లక్షలు ఖర్చయింది. అయితే చాలామంది చాపలపైనే పొరలు పోసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విజయనగరం, ఆనందపురంలో ఉన్న శీతల గిడ్డంగుల్లో కొందరు నిల్వ చేస్తారు. కానీ ప్రభుత్వ పరంగా ప్రత్యేక కేంద్రాలు లేవు.
ఆదాయం తక్కువైనా..
మామిడి కాయలను విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి టన్ను రూ.18 వేల చొప్పున కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం స్థానికంగానే వివిధ రకాలు అందుబాటులో ఉండడంతో వెయ్యి కిలోలు రూ.7 వేలకే వస్తున్నాయని చెబుతున్నారు. పంచదారను చోడవరంలోని చక్కెర కర్మాగారం నుంచి తెస్తున్నారు. ఒక్కో చాప నుంచి 70 కిలోల వరకు తాండ్ర వస్తుంది. దీని తయారీకి 600 వరకు కాయలు, 40 కిలోల పంచదార అవసరం. పెట్టుబడి, కూలీల ఖర్చుతో కలుపుకొని ఒక చాపకు రూ.5,500 వరకు ఖర్చవుతుందని అంచనా. దాన్ని అమ్మితే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు లాభం వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడివారు ఆదాయంతో సంబంధం లేకుండా తయారీకి ముందుకొస్తున్నారు.
రాయితీలు కల్పిస్తే ప్రయోజనం..
- కె.కృష్ణ, సర్పంచి, భీమాళి
మూడు సంవత్సరాల నుంచి పెద్దఎత్తున తయారు చేస్తున్నాం. యంత్రాలున్నా.. ఎక్కువగా కూలీలే పనులు చేస్తారు. అన్ని ఖర్చులు పోనూ దానికి తగ్గట్టుగానే ఆదాయం వస్తోంది. ఈ ఏడాది ఇక్కడ ఆరు లక్షల వరకు చాపలొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తే తయారీదారులు సంతోష పడతారు. ఆర్థిక ఇబ్బందులు సైతం దూరమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సాలూరు నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. -
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
[ 05-05-2024]
ఉపాధ్యాయులు నిజం చెప్పడమే రాష్ట్రంలో నేరమైంది. అడ్డదారులు తొక్కకుండా తమ పాఠశాలల్లో సమస్యలను నమోదు చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉన్నతాధికారులు నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. -
జనసేనలోకి చేరికలు
[ 05-05-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధోగతి పాల్జేశారని పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. -
జనం భూముల్లో జగన్ భూతం
[ 05-05-2024]
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన ఈశ్వరరావుకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాస్బుక్, టైటిల్ పత్రాలు తన వద్దే ఉన్నాయి. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
[ 05-05-2024]
జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభంకానుంది. -
‘అమ్మేసిన స్థలంలో వైకాపా కార్యాలయమా?’
[ 05-05-2024]
విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆక్రమణలతో పాటు ఆయన వద్ద స్థలాలు కొనుక్కున్నవారినీ వేధిస్తున్నారని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు -
40 ఏళ్ల నాటి ప్లాట్లు మాయం
[ 05-05-2024]
విజయనగరం జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే పెద్దఎత్తున చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆగు..ఆగు..దేవుడి మాన్యం డబ్బులేవీ?
[ 05-05-2024]
అధికారం.. ఆపై ఎమ్మెల్యే.. ఇంకేముందు ఎక్కడ భూములు కనిపించినా కొనేస్తున్నారు బొత్స అప్పలనర్సయ్య. ఈ క్రమంలోనే దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసలో దేవుడి మాన్యం కొన్నారు. -
అవ్వాతాతలతో సర్కారు చెలగాటం
[ 05-05-2024]
సామాజిక పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్లను జమ చేసి వైకాపా ప్రభుత్వం అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. -
జనం భూమిలో.. జగన్ చిచ్చు
[ 05-05-2024]
వైకాపా సర్కార్ కుట్రపూరితంగా తీసుకొస్తున్న ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022) ప్రజల భూముల పాలిటి ముప్పులా మారింది. -
తెదేపా విజయం ఖాయం
[ 05-05-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్