logo

మాంసం వ్యాపారి దారుణ హత్య

మహబూబాబాద్‌ పట్టణం నందినగర్‌లో మాంసం వ్యాపారి బానోతు లక్‌పతి (35) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఆయనపై బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మరణించారు. పట్టణంలోని నందినగర్‌ కాలనీ

Updated : 21 Jan 2022 04:18 IST
లక్‌పతి

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ పట్టణం నందినగర్‌లో మాంసం వ్యాపారి బానోతు లక్‌పతి (35) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఆయనపై బండరాయితో దాడి చేయగా అక్కడికక్కడే మరణించారు. పట్టణంలోని నందినగర్‌ కాలనీ శివారు చెరువు కట్ట వద్ద హత్య జరిగిందని 100 డయల్‌ ద్వారా వచ్చిన సమాచారం మేరకు  పట్టణ సీఐ వెంకటరత్నం సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారు సున్నపురాళ్ల తండాకు చెందిన బానోతు లక్‌పతి కొంతకాలంగా పట్టణంలోని కొత్తబజారులో మాంసం విక్రయిస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఫోన్‌ రావడంతో లక్‌పతి ఇంటి నుంచి నందినగర్‌ శివారు చెరువు కట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి చేరుకున్నాడు. పథకం ప్రకారం దుండగులు లక్‌పతి కళ్లలో కారం చల్లి ఇనుపరాడ్లతో బలంగా కొట్టి హత్య చేసి ఉంటారని అక్కడ ఉన్న వస్తువులను బట్టి తెలుస్తోందని సీఐ తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. లక్‌పతి కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య నీల, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తండ్రి రాజ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని