ఆయిల్ పామ్లో ఉంది..!
ఎక్కువ లాభం, తక్కువ నిర్వహణ కలిగిన ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆయిల్పామ్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, కేంద్ర బృందం
ఉమ్మడి జిల్లాలో సాగుకు అనుకూలం..
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
తొర్రూరు టౌన్: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామశివారులో టీఎస్ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో 42 ఎకరాల్లో గతేడాది అక్టోబరులో ప్రభుత్వం నర్సరీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఐదు లక్షల మొక్కలు పెంచుతున్నారు. నర్సరీలో షేడ్నెట్లో 4 నెలలు, అనంతరం ఓపెన్ గ్రౌండ్లో మరో 8 నెలలు పెంచి రాయితీపై రైతులకు అందజేస్తారు.
ఎక్కువ లాభం, తక్కువ నిర్వహణ కలిగిన ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్ల కిందట ఆయిల్పామ్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, కేంద్ర బృందం ఉమ్మడి జిల్లాలో సాగు పరిస్థితులపై సర్వే చేపట్టింది. ఇక్కడి నేలలు అనుకూలమని కేంద్ర శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. ఇప్పటికే జిల్లాల్లో 1929 ఎకరాల్లో పండిస్తున్నారు.
ప్రాసెసింగ్ యూనిట్లకు ఏర్పాట్లు..
ఆయిల్ పామ్ పంట కొనుగోళ్లు, మార్కెటింగ్పైనా ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులు స్థానికంగా విక్రయించుకునే ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకో ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించేందుకు కంపెనీలను ఎంపిక చేసింది.
తొర్రూరు మండలంలోని గొపలగిరి గ్రామశివారులో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం 80 ఎకరాల స్థల సేకరణ చేసింది. పనులు ప్రారంభం కావాల్సి ఉంది.్చ
ఈ పంటే ఎందుకంటే..
* ఆయిల్పామ్ లాభదాయకంగా ఉంటుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..
* మొక్కలు నాటిన 4వ ఏటా నుంచి పంట చేతికి వస్తుంది. 40 నుంచి 60 రోజుల్లో గెలలు కోతకు వస్తాయి. ఏడాది పొడవునా దిగుబడి వస్తూనే ఉంటుంది. 30 ఏళ్ల వరకు ఆదాయం ఉంటుంది.
* ఎకరాకు 14 నుంచి 18 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. టన్నుకు రూ.22 వేలు ధర పలుకుతోంది. 10 టన్నులు దిగుబడి వచ్చినా ఏడాదిలో రూ. 2.20 లక్షలు ఆర్జించవచ్ఛు
* యాజమాన్యం, నిర్వహణ తక్కువ.. పంటలకు రోగాలు, చీడపీడల బెడద ఉండదు.
* పంటకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మనదేశం.. ఏడాదికి రూ.70 వేల కోట్లకు పైగా విలువైన పామ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది.
* మొక్కమొక్కకు 9 మీటర్ల ఎడంతో నాటుతారు. అంతర పంటలను కూడా వేసుకోవచ్ఛు
* డ్రిప్ ఏర్పాటు కోసం హెక్టారుకు రూ.48,381 రాయితీ ఉంటుంది.
మొక్కలు కావాలా.. వీటిని అనుసరించండి
* తెలంగాణ ప్రభుత్వ పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఎండాలి. * క్షేత్రం మట్టి, నీటి పరీక్షలు నిర్వహించుకున్న పత్రాలు ఉంచుకోవాలి. * మండలంలోని ఉద్యానవన శాఖ విస్తరణాధికారి (హెచ్ఈవో) లేదా ఆయిల్పామ్ కంపెనీ ప్రతినిధి లేదా ఏఈఓలను కలిసి భూమికి సంబంధించిన వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి * తర్వాత ఉద్యానశాఖ అధికారి, మొక్కలు ఇచ్చే కంపెనీ ప్రతినిధి, డ్రిప్ కంపెనీ ప్రతినిధి సంయుక్త సర్వే చేస్తారు. అన్ని అనుకూలంగా ఉంటే ధ్రువీకరిస్తారు.* ఆన్లైన్లో రైైతు పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారు. * డ్రిప్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రైతు చెల్లించే వాటాను డీడీ తీయాలి. * సమగ్ర సమాచారంతో ఉద్యానశాఖ అధికారి రైతుకు సంబంధించిన దస్త్రాన్ని కలెక్టర్కు ప్రతిపాదిస్తారు. ఆయన పరిశీలించి మంజూరు ఇస్తారు. * మంజూరైన ఏడు రోజుల్లో డ్రిప్ పరికరాలు వస్తాయి.. కంపెనీ వారు బిగిస్తారు. * తర్వాత సీనియారిటి ప్రకారం మొక్కలు పంపిణీ చేస్తారు.
4 ఎకరాల్లో నాటాను.. : - శ్రీనివాస్, అడువాలపల్లి, మల్హర్ మండలం
ఆయిల్ పామ్తో లాభాలను అధికారులు వివరించారు. మట్టి నమూనాల పరీక్షలు చేయించాను. ఫలితాలు సానుకూలంగా ఉండటంతో 4 ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటాను. ప్రస్తుతానికి బాగుంది.
ప్రత్యామ్నాయ పంటగా ఎంచుకోవచ్చు : - అక్బర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి
ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ పామ్ సాగును రైతులు ఎంచుకోవచ్ఛు ఇతర పంటలతో పోల్చి చూసినప్పుడు ఇదెంతో లాభదాయకం. చీడపీడల బాధ, ప్రకృతి వైపరీత్యాల నష్టం కూడా తక్కువే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా