ఇక సర్వే బాట
మహబూబాబాద్ జిల్లా కేంద్రం రోజు రోజుకు విస్తరిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలతో పట్టణ జనాభా పెరుగుతోంది. భవిష్యత్తులో ప్రజల అవసరాల మేరకు
మానుకోట మాస్టర్ ప్లాన్కు కార్యాచరణ
పురపాలక సంఘం చిత్రపటం
మహబూబాబాద్, న్యూస్టుడే: మహబూబాబాద్ జిల్లా కేంద్రం రోజు రోజుకు విస్తరిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలతో పట్టణ జనాభా పెరుగుతోంది. భవిష్యత్తులో ప్రజల అవసరాల మేరకు పట్టణంలో మౌలిక సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) తయారీకి కార్యాచరణ రూపొందిస్తోంది. 2018కి ముందు బృహత్తర ప్రణాళికను రూపొందించారు. ఈ పురపాలక సంఘంలో ఆరు గ్రామపంచాయతీలు విలీనం కావడంతోపాటు జిల్లా కేంద్రంగా ఏర్పాటైంది. 2011 జనాభా ప్రాతిపదికను తీసుకొని 2044 వరకు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని అసౌకర్యాలు కల్పించేందుకు ఒక పద్ధతి ప్రకారం పట్టణాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 28 నుంచి క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ శాఖ అధికార స్థానిక అధికారులను ఆదేశించింది. ఇప్పటికే హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంతో పాటు శుక్రవారం వరంగల్లోని రీజనల్ డైరెక్టర్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్పై సమీక్షించారు. నూతన ప్రణాళికతో పట్టణ రూపురేఖలు మారనున్నాయి.
నలుగురు అర్బన్ ప్లానర్ల నియామకం
రాబోయే రెండు దశాబ్ధాల వరకు ప్రజల అవసరాల మేరకు పట్టణాన్ని ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు నలుగురు అర్బన్ ప్లానర్లను నియమించారు. వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించనున్నారు.
రహదారులు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యంతోపాటు ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు ఏ ప్రాంతంలో జనావాసాలు ఉండాలి మార్కెట్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, పట్టణీకరణ కోసం ఎంత శాతం భూములను కేటాయించాలనే అంశంపై ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
రహదారుల విస్తరణ, లే-అవుట్లు, క్రీడా మైదానాలు, వినోద స్థలాల కేటాయింపుపై సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తారు.
అధికారులు రూపొందించిన ప్రణాళికపై ప్రజాభిప్రాయం తీసుకుంటారు. ఆ తర్వాత ముసాయిదా తయారు చేసి పురపాలక వర్గం సమావేశంలో సభ్యుల సూచనలు, సలహాలతో సవరణలు చేసి ప్రభుత్వ ఆమోదం పొందుతారు. ఆ తర్వాత నిబంధనల మేరకు పట్టణీకరణపై ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకుంటారు. దీంతో ప్రణాళికాబద్దంగా పట్టణ నిర్మాణం జరుగుతుంది.
విలీన గ్రామాలు:
అనంతారం, జమాండ్లపల్లి, ఈదులపూసపల్లి, శనగపురం, రజాలిపేట, బేతోలు.
పట్టణ సరిహద్దు గ్రామాలు:
కురవి, మొగిలిచెర్ల, గుండ్రాతిమడుగు కొత్తూరు, ఉప్పలపాడు, గౌరారం, నడివాడ, రెడ్యాల, లక్ష్మీపురం, వేమునూర్, అన్నారం, ముడుపుగల్, పర్వతగిరి, మల్యాల.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్