మాయమవుతున్నాయ్..!
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు సుమారు మూడు దశాబ్ధాల కిందట నిర్మించిన ఎస్సారెస్పీ మైనర్ కాలువలు మాయమవుతున్నాయి.
కబ్జాకు గురవుతున్న ఎస్సారెస్పీ మైనర్ కాలువలు
మహబూబాబాద్, న్యూస్టుడే: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు సుమారు మూడు దశాబ్ధాల కిందట నిర్మించిన ఎస్సారెస్పీ మైనర్ కాలువలు మాయమవుతున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల పరిధిలో నలువైపుల సాగుతున్న స్థిరాస్తి వ్యాపారం జోరులో ఆ కాలువల ఆనవాళ్లు కనిపించడం లేదు. సంబంధితశాఖ అధికారులు ఈ విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
రెవెన్యూ, ఎస్సారెస్పీ(నీటి పారుదల) శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆ కాలువలు అన్యాక్రాంతమవుతున్నాయి. సాగు భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే సమయంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిలో గతంలో ఎస్సారెస్పీ కాలువలకు భూసేకరణ చేశారా... ఇంతకు ముందు ఏమైనా కాలువలు ఉన్నాయా అనే విషయం పరిశీలించకుండానే నాలా అనుమతులు జారీ చేస్తుండడంతో కబ్జాకు గురవుతున్నాయని ప్రచారంలో ఉంది.
ఇళ్ల నిర్మాణాల కోసమే..
దశాబ్దానికి పూర్వం సుమారు లక్ష ఎకరాలకు పైగా భూములకు సాగునీటిని సరఫరా చేసేందుకు ఎస్సారెస్పీ (వెన్నవరం) డీబీఎం-48 మొదటి దశ కాలువలను నిర్మించారు. భూములు కోల్పోయిన వారికి అప్పటి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించారు. ప్రధాన కాలువలకు అనుసంధానంగా ఉన్న 18 ఎల్ఆర్, 16 ఎల్ఆర్, 12 ఎల్ఆర్, 8 ఎల్ఆర్, 4 ఎల్ఆర్ మైనర్ (పిల్ల) కాలువలను పూడ్చివేసి తమ పొలాలతో కలిపి కొందరు ఇళ్ల స్థలాలుగా మారుస్తున్నారు. మరికొందరు తమ భూముల్లోనే కలుపుకొని సాగు చేసుకుంటున్నారు. సుమారు 36 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మహబూబాబాద్ పట్టణం చుట్టూ సాగు భూములు, వ్యవసాయేతర భూములుగా మారడంతో మైనర్ కాలువలను క్రమేణా మూసివేస్తున్నారు.
ఉదాహరణకు కొన్ని
* మహబూబాబాద్ పట్టణంలోని ఈదులపూసపల్లి వెళ్లే రోడ్లో అంబేడ్కర్ కాలనీ సమీపంలో ఎస్పారెస్పీ కాలువలు అదృశ్యమయ్యాయి.
* శనగపురం శివారు, బీసీ కాలనీ సమీప ప్రాంతాల్లో కూడా అన్యాక్రాంతానికి గురైంది.
* మంగళి కాలనీ- మల్యాల వెళ్లే రోడ్లో కాలువలను పూడ్చి వేశారు.
* మరిపెడ వెళ్లే రోడ్ నుంచి అనంతాద్రి ఆలయం వెళ్లే రోడ్లో వ్యవసాయ భూములు ఇళ్ల స్థలాలుగా మారడంతో ఎస్పారెస్పీ మైనర్ కాలువలు కనిపించడం లేదు.
పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం : - కిషోర్, డీఈఈ, నీటి పారుదలశాఖ
కాలువలు పూడ్చివేసినట్లు సమాచారం వస్తే క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఎస్సారెస్పీ కాలువలను ఆక్రమించినా, ధ్వంసం చేసినా కఠిన చర్యలు తప్పవు.
కాలువ అంచువరకు చదును
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎస్పారెస్పీ కాలువ పర్వతగిరి రెవెన్యూ గ్రామం పరిధిలోని సుమారు 500 మీటర్ల పొడవు వరకు ఎస్సారెస్పీ కాలువ అంచు వరకు చదును చేసి సంబంధిత ఆ రైతు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఫుట్వేగా రెండు వైపుల ఉన్న స్థలాన్ని సంబంధిత రైతు కబ్జా చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుంది. ఇలా వ్యవసాయ భూముల్లో నుంచి వెళుతున్న కాలువను పలువురు ఆక్రమించుకున్నారు.
పూడ్చేస్తున్నారు..
మహబూబాబాద్ పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో సబ్జైల్కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఈ కాలువను సమీప ప్రాంత రైతులు పూడ్చేశారు. ఇటీవల ఆ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చేందుకు కాలువ పొడువున ఉన్న ఫుట్వే (కాలిబాట) కోసం సేకరించిన స్థలాన్ని కూడా భూముల్లో కలిపివేశారు. ఈ ప్రాంతంలో గజం స్థలం విలువ రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఒక్కో ప్లాట్లో పది గజాల స్థలం కలిసినా రూ. లక్ష విలువైన భూమిని ఎస్పారెస్పీ కాలువ కోల్పోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..