దేశ ప్రగతి.. యువ భారత స్ఫూర్తి
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా ఇప్పటి వరకు దేశం సాధించిన ప్రగతి.. ఇంకా ఎలాంటి మార్పులు రావాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. తదితర అంశాలు తెలుసుకోవడానికి ‘ఈనాడు’ మూడు జిల్లాలో చర్చావేదికలు, మరో జిల్లాలో
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా ఇప్పటి వరకు దేశం సాధించిన ప్రగతి.. ఇంకా ఎలాంటి మార్పులు రావాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. తదితర అంశాలు తెలుసుకోవడానికి ‘ఈనాడు’ మూడు జిల్లాలో చర్చావేదికలు, మరో జిల్లాలో వాట్సాప్ సర్వే చేసింది. ఇందులో పాల్గొన్న యువత వారి అభిప్రాయాలు వెల్లడించారు.
వేగంగా అభివృద్ధి
చర్చావేదికలో ఉపాధ్యాయులు
రేగొండ : అభివృద్ధి పనులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరగాలని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో ‘స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. భారతదేశం ప్రగతి’పై చర్చావేదిక జరిగింది. అందరికి సమాన స్థాయిలో విద్య, వైద్యం అందలాంటే ఆ రెండు వ్యవస్థలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దేశం మరింత ప్రగతి పథంలో నడుస్తుందని’ ఉపాధ్యాయులు రాజు, ప్రకాష్, దీపిక, మాలతి వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. * రజనీకుమార్ మాట్లాడుతూ.. దేశం మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వరంగ వ్యవస్థలను ప్రైవేటు సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలన్నారు. * సంధ్యారాణి వివరిస్తూ.. ప్రభుత్వ ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలని, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా ప్రణాళిక రచించాలన్నారు.
ప్రజా నాయకుడు అవసరం
పాల్గొన్న ఎస్సార్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల విద్యార్థినులు
బాలసముద్రం, న్యూస్టుడే : తమ, పర బేధం లేకుండా, కుల మతాలకతీతంగా జాతీయ ప్రయోజనాల కోసమే నాయకులు పని చేయాలని యువత అభిప్రాయపడింది. ‘నాయకులు ఎలా ఉండాలి’ అంశంపై నిర్వహించిన చర్చావేదికలో అడ్వకేట్స్ కాలనీలోని ఎస్సార్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల విద్యార్థులు తమ అభిప్రాయాలు వెల్ల్లడించారు. * ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటూ బాధ్యతగా ఉండాలని ఎం.హేమశ్రీ అభిప్రాయపడ్డారు. * పదవి కోసం కాదు ప్రజల కోసం పరితపించాలని వి.మమత పేర్కొన్నారు. * నాయకుడికి చెప్పుకుంటే సమస్య పరిష్కరిస్తారనే నమ్మకం కల్పించాలని ఎ.ప్రణీత చెప్పారు. * పి.మమత మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. * వి.చంద్రకళ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారు నాయకుడైతే అన్ని విషయాలపై అవగాహన ఉంటుందన్నారు. * అవినీతి రహిత సమాజం కోసం పాటుపడాలని జి.రష్మిక అన్నారు. * హామీలు ఇవ్వడం కాదు.. నెరవేర్చడం ముఖ్యమని ఎం.ప్రణీత పటేల్ చెప్పారు. * సీీహెచ్.భానుశ్రీ మాట్లాడుతూ మహిళా చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. * వంశపారంపర్య రాజకీయాలకు చరమగీతం పాడాలని, యువతకు అవకాశాలు కల్పించాలని మహేశ్వరి పేర్కొన్నారు.
విస్తృత విద్యావకాశాలు
నెహ్రూసెంటర్, న్యూస్టుడే: మహబూబాబాద్లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ, ఫార్మసీ కళాశాలలో ‘స్వాతంత్య్ర భారతావనిలో విద్యారంగ అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ప్రిన్సిపల్ డాక్టర్ దయాకర్ మాట్లాడారు. అధ్యాపకులు వాసంతి, సరిత పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మహిళా విద్యకు ప్రాధాన్యం పెరిగిందని.. పర్షిస్ అనే విద్యార్థిని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో సౌకర్యాల కల్పనతో ఉచితంగా విద్యను అందించడంతో నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని వైష్ణవి తెలిపారు. మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రాన్ని సాధించామని, సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలని భవానీ సూచించారు.
స్వాతంత్య్ర ఫలాలు.. అందరికీ అందాలి
ఆనాటి మహనీయుల కోరుకున్న విధంగా స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా అని ‘న్యూస్టుడే’ సర్వే నిర్వహించింది. జనగామ జిల్లాలో వాట్సప్ ద్వారా 75 మంది యువత, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు ఇందులో భాగస్వాములయ్యారు. వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. - జనగామ అర్బన్
బాలల ‘చిత్రం’
స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా చిత్రాలను గీసి పంపించాలని ‘ఈనాడు’ ఇచ్చిన పిలుపునకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. జాతీయభావాన్ని చాటేలా అనేక చిత్రాలను గీసి ఆకట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిత్రాలు రాగా వాటిలో నుంచి కొన్ని ఈరోజు మీ ముందుకు తెస్తున్నాం. - జనగామ అర్బన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?