logo

అమ్మానాన్న.. మీతోనే నేను!

అమ్మానాన్నలతో సంతోషంగా పుట్టినరోజు సంబురం జరుగుతుందని అనుకున్న చిన్నారి మృత్యువు ఒడిలోకి చేరింది.

Published : 25 Nov 2022 04:58 IST

పుట్టిన రోజు జరుపుకోవాల్సిన చిన్నారి మృత్యుఒడికి

మట్టెవాడ, కనగానపల్లి, న్యూస్‌టుడే: అమ్మానాన్నలతో సంతోషంగా పుట్టినరోజు సంబురం జరుగుతుందని అనుకున్న చిన్నారి మృత్యువు ఒడిలోకి చేరింది. తల్లిదండ్రులు లేని జీవితం నాకు అవసరం లేదనుకుందేమో ఆ చిట్టితలి. పుట్టినరోజుకు ఒకరోజు ముందే చిన్నారి హాసిని (1) మృతి చెందడంతో నగరవాసుల గుండె బరువెక్కింది. ఈనెల 25న హాసిని తొలి పుట్టినరోజు జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లి వద్ద ఈనెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్‌ వాసులు గోపినాథ్‌, రమ్య దంపతులు,  తల్లి తారకేశ్వరి మృతి చెందారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హాసిని (గోపినాథ్‌, రమ్య దంపతుల కూతురు) చికిత్స పొందుతూ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం మరణించింది. కుమారుడు సాహిత్‌ పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం, పుట్టినరోజే చిన్నారి హాసిని అంత్యక్రియలు చేయాల్సి రావడంతో బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని