logo

జాగిలం సేవలకు సెల్యూట్‌!

మహబూబాబాద్‌ జిల్లా పోలీస్‌ శాఖలో సేవలందించి అనారోగ్యంతో మృతి చెందిన జాగిలం (రైడర్‌)కు గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Published : 02 Dec 2022 04:31 IST

న్యూస్‌టుడే, నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ జిల్లా పోలీస్‌ శాఖలో సేవలందించి అనారోగ్యంతో మృతి చెందిన జాగిలం (రైడర్‌)కు గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఏఆర్‌ డీఎస్పీ ఆర్‌ జనార్ధన్‌రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. ఏడేళ్లుగా జిల్లా పోలీస్‌ శాఖకు సేవలు అందించిందన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం గేటుకు రైడర్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆర్‌ఐలు నర్సయ్య, పూర్ణచందర్‌, సురేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని