logo

మరణంలోనూ వీడని బంధం..!

సుమారు అరవై ఏళ్లు అన్యోన్య జీవనం గడిపారు.. కష్టాలు, సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు.. అనారోగ్యంతో భార్య మృతి చెందగా.. ఆమె మృతి తట్టుకోలేని భర్త కొన్ని గంటల వ్యవధిలోనే మరణించిన సంఘటన ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో విషాదాన్ని నింపింది.

Published : 30 Jan 2023 05:18 IST

కొమ్మాల్‌రెడ్డి, కొమురమ్మ

కేసముద్రం, న్యూస్‌టుడే: సుమారు అరవై ఏళ్లు అన్యోన్య జీవనం గడిపారు.. కష్టాలు, సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు.. అనారోగ్యంతో భార్య మృతి చెందగా.. ఆమె మృతి తట్టుకోలేని భర్త కొన్ని గంటల వ్యవధిలోనే మరణించిన సంఘటన ఆదివారం మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన కందుల కొమురమ్మ(75), కొమ్మాల్‌రెడ్డి(80) దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొమ్మాల్‌రెడ్డి ఏడాదిగా అనారోగ్యంతో మంచం పట్టారు. అప్పటి నుంచి కొమురమ్మ భర్తకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా సపర్యలు చేశారు. వారం రోజుల కిందట ఆమె పక్షవాతానికి గురయ్యారు. ఆదివారం ఉదయం 8.30కు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులంతా ఇనుగుర్తికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కాడి పేర్చి మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమవుతుండగా మంచంలోనే ఉండి ఇదంతా గమనిస్తున్న కొమ్మాల్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. భార్య తనకు చేసిన సేవలను తలుచుకోవడంతో ఆయన ఆవేదన రెట్టింపైంది. ఆ దుఃఖాన్ని భరించలేక అతను మధ్యాహ్నం రెండు గంటలకు కన్నుమూశారు. ఇది గమనించిన బంధువులు కొమ్మాల్‌రెడ్డి అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు పూర్తి చేసి సాయంత్రం ఇద్దరివీ ఒకేసారి నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని