బదిలీలకు ని‘బంధనాలు’
ఓ వైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. మరోవైపు రాష్ట్రస్థాయి పైరవీలతో బదిలీలు చేస్తుండటంతో అయోమయం నెలకొంది.
ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
న్యూస్టుడే, భూపాలపల్లి
డీఈవో కార్యాలయంలో దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు
ఓ వైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొదలైంది. మరోవైపు రాష్ట్రస్థాయి పైరవీలతో బదిలీలు చేస్తుండటంతో అయోమయం నెలకొంది. విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం అర్హుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయడంతో పాటు సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో పొందుపర్చారు. గ్రేడ్-2 గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీకి మొదట ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు అర్హులని ప్రభుత్వం పేర్కొంది. తర్వాత అయిదేళ్లకు కుదించడంతో అందుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేశారు. డీఎస్సీ, రిజర్వేషన్ మెరిట్ ఆధారంగా జాబితాలు పొందుపర్చారు. అయితే.. వేర్వేరు పద్ధతుల్లో సీనియారిటీ జాబితాను తయారు చేయడంతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
317 జీవోతో
317 జీవో ప్రకారం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొత్త స్థానికత అమలులో వారు గతంలో కోల్పోయిన సర్వీసును పరిగణించకపోవడంతో వారు జూనియర్లుగా గుర్తించబడుతున్నారు. కొందరు తమ స్పౌజ్ కేసులకు సంబంధించి పనిచేస్తున్న జిల్లా, జోన్లను విడిచి వేరొక జిల్లా, జోన్కు కేటాయించబడ్డారు. భార్యా భర్తలు వేరువేరు జిల్లాల్లో సుమారు వంద కిలోమీటర్లకు పైగా దూరంలో పనిచేయడంతో వారు మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేసి, తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు. ఇప్పటివరకు స్పౌజ్ కేసుల్లో జిల్లా నుంచి కేవలం 18 మంది బదిలీ అయ్యారు. ఇంకా బదిలీ కావల్సిన వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా భాషా పండితులకు పదోన్నతుల విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపడంతో వారు ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు భాషా బోధన నిలుపుదల చేస్తామని తెలంగాణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం డీఈవోకు వినతిపత్రాన్ని ఇచ్చారు. పైరవీలతో నిర్వహించే బదిలీలు నిలుపుదల చేయాలని, జీరో సర్వీసు బదిలీలకు అనుమతివ్వాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
కోర్టు పేరుతో నష్టం చేయకండి..
- గడ్డం లక్ష్మయ్య, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు
భాషా పండితులకు పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ను విడుదల చేయాలి. కోర్టు కేసుల సాకుతో ప్రభుత్వం భాషా పండితులపై నిర్లక్ష్య వైఖరి తగదు. వికలాంగుల కోటలో నిబంధనలు కచ్చితంగా పాటించి, పదోన్నతులు చేపట్టాలి. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి. వంద మార్కులకు బోధించే భాషా పండితులకు పదోన్నతులు కల్పించకుండా 50 మార్కులు బోధించే వారికి పదోన్నతులు కల్పించడం విడ్డూరం.
దొడ్డిదారిన తగదు..
- మధుసూదన్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వం చేపడుతున్న పదోన్నతులు, బదిలీల విషయంలో ఓవైపు అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సహకరించాలని కోరుతూనే దొడ్డిదారిన బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. స్థానికతను కోల్పోయి 317 జీవో ప్రకారం నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయకుండా, పెండింగ్ కేసులు పరిష్కరించకుండా, పూర్తి స్థాయిలో స్పౌజ్ కేసులకు సంబంధించి ఉపాధ్యాయులకు న్యాయం చేయకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదు.
స్పష్టమైన ఉత్తర్వులు రాకపోవడంతో..
- సుభాకర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్ర విద్యాశాఖ నుంచి స్పష్టమైన రాతపూర్వక ఉత్తర్వులు విడుదల చేయకపోవటంతో జిల్లాకోలా సీనియారిటీ జాబితాలను రూపొందించడంతో కొందరు ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. కోర్టు కేసుల పేరుతో పండిట్, పీఈటీలకు పదోన్నతులు కల్పించకపోవడం సరైంది కాదు. జీరో సర్వీసును పరిగణలోకి తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!