logo

ప్రేమికురాలి ఆత్మహత్యకు కారకుడైన ప్రియుడికి రిమాండ్‌

యువతిని ప్రేమ పేరుతో వంచించి మోసం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన ఘటనలో ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరకాల సీఐ కిషన్‌ సోమవారం తెలిపారు.

Published : 21 Mar 2023 04:15 IST

పోలీసుల అదుపులో నిందితుడు శివాజీ

పరకాల రూరల్‌, న్యూస్‌టుడే: యువతిని ప్రేమ పేరుతో వంచించి మోసం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన ఘటనలో ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరకాల సీఐ కిషన్‌ సోమవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల మండలంలోని యువతి ఈనెల 7న ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే మండలం కామారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంద శివాజీకి యువతికి మధ్య జరిగిన ఫోన్‌ మేసేజ్‌లను పోలీసులు పరిశీలించారు. మాయమాటలతో ఆమెను ప్రేమలోకి దింపినట్లు విచారణలో తేలింది. శివాజీ మరో యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాటింగ్‌ చేస్తున్నట్లు యువతికి అనుమానం వచ్చింది.  ఈవిషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. శివాజీ తన ఫోన్‌ ద్వారా  చచ్చిపో అంటూ యువతికి మెసేజ్‌ పంపించాడు. మనోవేదకు గురైన ఆమె  ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి మృతికి కారకుడైన మంద శివాజీని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని