సాగునీటి వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
అభివృద్ధి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో చేసి చూపించారని ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్ అన్నారు.
మహబూబాబాద్లో మున్నేరు వాగు వద్ద పూజ చేస్తున్న ఎమ్మెల్యే శంకర్నాయక్
మహబూబాబాద్, న్యూస్టుడే: అభివృద్ధి ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో చేసి చూపించారని ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్ అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని మున్నేరువాగు వద్ద నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మున్నేరు వాగులోని చెక్డ్యాం వద్ద పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలం వచ్చిందంటే మున్నేరువాగు ఎండిపోయి తాగునీటి కోసం గతంలో ఇతర ప్రాంతాల వైపు చూసేవారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ప్రతి గ్రామంలోని చెరువులు కళకళలాడుతున్నాయన్నారు. దీంతో రైతులు రెండు పంటలు పండిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఈ అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై పవర్ ఆఫ్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో కొమురయ్య, నీటిపారుదల శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, పురపాలక సంఘం ఛైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ఛైర్మన్ ఎండీ.ఫరీద్, వార్డు కౌన్సిలర్లు చిట్యాల జనార్ధన్, మార్నేని వెంకన్న, బత్తుల సరస్వతి, వట్టం జ్యోత్స్న, బండి ఇందిర, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.
పంటల నిలయాలుగా ఎడారి ప్రాంతాలు
నర్సింహులపేట, న్యూస్టుడే: జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఒకప్పుడు నీటి చుక్క లేక ఏడారి ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుతం కాళేశ్వరం జలాలతో రెండు పంటల సాగుకు నిలయంగా మారిందని జిల్లా పాలనాధికారి శశాంక అన్నారు. నర్సింహులపేటలోని ఓ వేడుకల మందిరంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సాగు నీటి దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్యే రెడ్యానాయక్తో పాటు జిల్లా పాలనాధికారి బుధవారం హజరయ్యారు. నియోజకవర్గంలో ఉన్న 180 పెద్ద చెరువుల్లో 50శాతం పైగా చెరువులు నీటి కళతో ఉన్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం అన్నారు. ఆరు సంవత్సరాల కాలంలోనే 21 చెక్డ్యాంలు నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. ఎంపీపీలు పద్మ, సుశీల, నీటి పారుదల శాఖ ఈఈ సుదర్శన్, డీఈ రాజ్కుమార్, దశాబ్ది ఉత్సవాల నియోజకవర్గ అధికారి సుధాకర్, తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, సర్పంచి రజితారెడ్డి, వైస్ ఎంపీపీ దేవేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు తోట సురేష్, భారాస మండలాధ్యక్షుడు మైదం దేవేందర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..