తూర్పు రాజకీయం.. రసవత్తరం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. కాకతీయులు పాలించిన ఖిలావరంగల్ కోట ఉంది. కిరాణం, అనాజ్, వస్త్రాలు, జనరల్ స్టోర్స్ హోల్సేల్ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా బాసిల్లుతోంది. వరంగల్ లక్ష్మిపురంలో కూరగాయలు, పండ్ల మార్కెట్ ఉంది. వ్యాపారులు, ఉద్యోగులు, మేధావులు, వివిధ రకాలైన వృత్తిదారులు, కార్మికులు, కర్షకులుంటారు. తూర్పు నియోజకవర్గం పూర్తిగా పట్టణ ప్రాంతం. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణంలో ముఖ్యభూమిక పోషిస్తోంది. పేరుకు పట్టణమైనా ఖిలావరంగల్ కోట, ఉర్సు, రంగశాయిపేట, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్తోట, దేశాయిపేటలో ఇప్పటికి గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది. మురికివాడలు, పేదల బస్తీలున్నాయి.
కార్పొరేషన్, న్యూస్టుడే
నియోజకవర్గం ముచ్చట
రాజకీయ నేపథ్యం
24 డివిజన్లు, సుమారు 3.50 లక్షల పైచిలుకు జనాభా ఉంటుంది. 2,46,367 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో వరంగల్ నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో వరంగల్ తూర్పుగా ఏర్పడింది. ః తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఎస్.రాజలింగం ఎన్నికయ్యారు. 1962, 1967లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బండారు నాగభూషణరావు, టీఎస్.మూర్తి గెలుపొందారు. ః 1952 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 8 కాంగ్రెస్, 3 తెదేపా, 2 తెరాస, 2 స్వతంత్రులు గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలోనూ కాంగ్రెస్ గెలుపొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో కొండా సురేఖ, నన్నపునేని నరేందర్ తెరాస తరఫున విజయం సాధించారు.
రెండుసార్లు మంత్రి పదవులు: వరంగల్ తూర్పునకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో రెండు సార్లు మంత్రి పదవులు దక్కాయి. 1989లో కాంగ్రెస్ నుంచి గెలిచిన తక్కళ్లపెల్లి పురుషోత్తమరావు, 1993లో దివంగత కోట్ల విజయభాస్కర్రెడ్డి మంత్రి మండలిలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి పదవి వరించింది. 1999 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన బస్వరాజు సారయ్య 2012లో కిరణ్కుమార్రెడ్డి హయాంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఈసారి త్రిముఖ పోరు..
- గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి పోటీ ఎక్కువగా ఉంటుంది. భారాస, కాంగ్రెస్, భాజపాల మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశాలున్నాయి.
- మూడేళ్ల పాటు మేయర్గా పనిచేసిన నన్నపునేని నరేందర్ 2018లో తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన భారాస నుంచి బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
- శాయంపేట, పరకాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, దివంగత వైఎస్సాఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2014లో తూర్పు నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2018లో కాంగ్రెస్లో చేరి పరకాల నుంచి ఓటమి పాలయ్యారు.
- భాజపా అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావు పదిహేనేళ్లుగా వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్గా ఉన్నారు. వ్యాపారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
ఓటర్ల వివరాలు
పురుషులు 1,20,323
మహిళలు 1,25,621
ట్రాన్స్జెండర్లు 338
మొత్తం ఓటర్లు: 2,46,282
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..