రోజుకో మలుపు.. పోలీసు శాఖలో కుదుపు
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇందులో ఉమ్మడి వరంగల్కు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తుండడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఓరుగల్లు చుట్టూ ఫోన్ ట్యాపింగ్ కేసు
ఈనాడు, వరంగల్: సంచలనం సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇందులో ఉమ్మడి వరంగల్కు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వస్తుండడంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో పలువురు నిందితులకు వరంగల్తో వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సంబంధాలు ఉండడం పోలీసు శాఖను కుదుపేస్తోంది.
ఊహాగానాలు అనేకం
ఈ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారిస్తుండగా సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి. రోజుకొకరి పేరు తెరపైకి వస్తుండడంతో పోలీసు వర్గాల్లో ఆందోళన మొదలైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. ట్యాపింగ్లో ఎవరెవరు పాలుపంచుకున్నారు. ఎంతమంది నెంబర్లను ట్యాపింగ్ చేశారు? అసలు వార్రూంలను వరంగల్లో ఏర్పాటుచేశారా అన్న అనేక రకాల అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది.
ఇక్కడివారే..
ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు స్వస్థలం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల. ఆయన గత ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా పనిచేశారని, ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
మరో కీలక నిందితుడు ‘ఎస్ఐబీ’ విభాగంలో పనిచేసిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లి. ఆయన అమ్మమ్మగారిల్లు పర్వతగిరి. ట్యాపింగ్ చేసేందుకు ఒక వార్రూంను పర్వతగిరిలోనే ఏర్పాటు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
భుజంగరావు అరెస్టుతో..
వరంగల్లో పనిచేస్తున్న ఇద్దరు ఇన్స్పెక్టర్లను సైతం అదుపులోకి తీసుకున్నారని ఇటీవల దుమారం చెలరేగినా నిర్ధారణ కాలేదు. ఆ మర్నాడే ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు పాత్రపై ఆరోపణలు వచ్చాయి. ప్రణీత్రావు విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో సంబంధం ఉందన్న సమాచారంతో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును మార్చి 23న హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకు ఆయన ఇంటెలిజెన్స్ పొలిటికల్ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేశారు. ఫోన్ ట్యాపింగ్లో భుజంగరావు పాత్రపై దర్యాప్తు బృందం ఆయన్ను ప్రశ్నించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన భూపాలపల్లి అదనపు ఎస్పీగా వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక