ప్రయాణం చవక..పార్కింగ్ భారం
వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు.
రైల్వేస్టేషన్లలో దోపిడీ
ఖమ్మంలోని ఓ డిగ్రీ కళాశాల లెక్చరర్ వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం ఎక్స్ప్రెస్ రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. వెళ్లి రావడానికి రూ.120 టికెట్కు ఖర్చవుతోంది. ద్విచక్ర వాహనానికి పార్కింగ్ ఛార్జీ కింద ఉదయం నుంచి సాయంత్రానికి రూ.160 చెల్లించాల్సి వస్తోంది.
కరీంనగర్కు చెందిన శ్రీనివాస్ ఇటీవల కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లేందుకు వరంగల్ రైల్వేస్టేషన్కు వచ్చారు. కారు పార్కింగ్ కోసం రోజుకు రూ.240 చొప్పున, రెండు రోజులకు కలిపి రూ.480 చెల్లించమనడంతో కంగుతిన్నారు. వరంగల్ నుంచి తిరుపతికి రైలు టికెట్ రూ.533 ఉంటే పార్కింగ్ కోసం రూ.480 ఏమిటని పార్కింగ్ నిర్వాహకులను నిలదీయడంతో రూ.80 తగ్గించారు.
గిర్మాజీపేట, న్యూస్టుడే: వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని తీసుకెళ్లడానికి, కుటుంబ సభ్యులు, బంధువులకు వీడ్కోలు పలికేందుకు మరికొంత మంది వస్తుంటారు. వీరంతా తమ వాహనాలను స్టేషన్లోని పార్కింగ్ ఏరియాలో ఉంచాలి. ఇక్కడి ఛార్జీలు వారికి చుక్కలు చూపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
- రైల్వేస్టేషన్ పార్కింగ్ ఏరియాలో తొలి 2 గంటలకు 18 శాతం జీఎస్టీతో కలుపుకొని రూ.20, ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున ఛార్జీ రెట్టింపవుతోంది. స్టేషన్లో 24 గంటల పార్కింగ్ ఛార్జీ చెల్లించే మొత్తంతో వరంగల్ నుంచి విజయవాడకు, తిరిగి విజయవాడ నుంచి వరంగల్కు సూపర్ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించొచ్చు.
- ‘వరంగల్ రైల్వేస్టేషన్కు ముందూ వెనుక రెండువైపులా పార్కింగ్ స్థలాలున్నాయి. నిబంధనల ప్రకారం కంప్యూటర్ జనరేటెడ్ రసీదు ఇవ్వాల్సి ఉండగా.. ముద్రించిన కాగితాలను ఇస్తున్నారు. నిర్ణీత సమయం గడిచిన తర్వాత రూ.50 నుంచి రూ.200 వరకు ఇష్టారీతిగా వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.
- ఈ విషయంపై వరంగల్ రైల్వేస్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ను వివరణ కోరగా పార్కింగ్ ఏరియాల్లో నిబంధనలు మేరకే ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పారు. అదనంగా వసూలు చేస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు.
- పార్కింగ్ టెండర్ కోసం ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు జీఎస్టీతో కలిపి రూ.33.50 లక్షలు చెల్లించాల్సిన కారణంగా.. నిర్వాహకులు ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
- నిర్దేశించిన స్థలం వాహనాలతో నిండిపోతుండటంతో స్టేషన్ ఆవరణలో ఎండలోనే నిలపాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.
బస్టాండులో రూ.20.. రైల్వేస్టేషన్లో రూ.60
- హరి, ధర్మారం, గీసుకొండ
మహబూబాబాద్లోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న నా కుమారుడిని చూసేందుకు ప్యాసింజర్ రైళ్లో వెళ్లాను. రైలు టికెట్కు రానుపోను రూ.60 మాత్రమే ఖర్చయ్యింది. పార్కింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని తీసుకోవడానికి అదేరోజు మధ్యాహ్నం వెళితే రూ.60 చెల్లించాలన్నారు. పక్కనే ఉన్న వరంగల్ బస్టాండులో ప్రతిసారి రూ.20కే పార్కింగ్ చేసేవాడిని.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా