వైద్యుడు లేక అందని గుండె పరీక్షల సేవలు
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది.
అలంకారప్రాయంగా టుడీ-ఈకో యంత్రం
జనగామ టౌన్, న్యూస్టుడే: జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత జనగామలో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ హబ్లను ఏర్పాటు చేసింది. డయాగ్నస్టిక్ కేంద్రంలో రక్త, మూత్ర సంబంధిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. రేడియాలజీ హబ్లో ఈసీజీ, ఎక్స్రే, మామోగ్రామ్, యూఎస్ స్కానింగ్ సౌకర్యాలతో పాటు గుండె పరీక్షలు చేయడానికి రూ.15 లక్షల వ్యయంతో టుడీ-ఈకో యంత్రం అందుబాటులోకి తీసుకువచ్చారు. రేడియాలజీ హబ్ ఏర్పాటై ఏడాది గడుస్తోంది. అయితే ఏడాది కాలంగా రేడియాలజీ హబ్లో టుడీ-ఈకో పరీక్షలు చేసేందుకు అవసరమైన రేడియాలజీ వైద్యుడు, కార్డియాలజిస్ట్ వైద్యుడు లేకపోవడంతో టుడీ-ఈకో యంత్రం అలంకారప్రాయంగా మారిందని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక యంత్రాలను సమకూర్చిన ప్రభుత్వం హబ్లో వైద్యులను నియమించకపోవడంతో రోగులకు సేవలందించాల్సిన రేడియాలజీ హబ్లోని గుండె పరీక్షల విభాగం నిరుపయోగంగా మారింది.
ప్రైవేటులో ఎక్కువ ఖర్చు
టుడీ-ఈకో యంత్రం ఉన్న నిరుపయోగంగా మారడంతో జిల్లాలోని 12 మండలాల ప్రజలు ప్రభుత్వ పరిధిలో ఉచితంగా గుండె పరీక్షలు చేసే విభాగం లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో గుండె పరీక్షకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, తీసుకునే ఆహార అలవాట్లతో ఎక్కువ మంది అధిక రక్తపోటు సమస్యతో గుండె సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. గుండె పరీక్షలు చేసే టుడీ-ఈకో యంత్రంతో కార్డియాలజిస్ట్, రేడియాలజిస్ట్ వైద్య పరీక్షలు చేస్తే సదరు వ్యక్తి గుండె సంబంధిత సమస్యలు సకాలంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన చికిత్స, స్టంట్లు వేసుకోవడం, బైపాస్ సర్జరీ వంటివి చేయించుకుంటారు. ఇంత అత్యవసరమైన టుడీ-ఈకో యంత్రం మొక్కుబడిగా ఏర్పాటు చేసి పరీక్షలు చేసే వైద్యుడిని నియమించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రేడియాలజీ హబ్లోని టుడీ-ఈకో యంత్రం ప్రజలకు ఉపయోపడే విధంగా సంబంధిత వైద్య పరీక్షలు చేసే వైద్యుడిని నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
- శ్రీనివాస్, రేడియాలజీ హబ్ ఇన్ఛార్జి
రేడియాలజీ హబ్లో టుడీ-ఈకో యంత్రం విభాగంలో వైద్యుడు లేకపోవడంతో పరీక్షలు చేయలేకపోతున్నాం. ఈ సమస్యను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వైద్యుడిని నియమిస్తే టుడీ-ఈకో సేవలు అందుబాటులోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో చెప్పాలి?: కేసీఆర్
[ 28-04-2024]
రాష్ట్రంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు కమీషన్లు అడుగుతున్నారని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. -
స్వగ్రామానికి గౌతమ్ మృతదేహం
[ 28-04-2024]
ఈనెల 21న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి కమల్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు పార్శి గౌతమ్ కుమార్(19) మృతదేహంఏడు రోజుల అనంతరం నేడు స్వగ్రామానికి చేరుకుంది. -
కేసీఆర్ రోడ్ షో నేడు
[ 28-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం వరంగల్ నగరంలో బస్సు యాత్రలో పాల్గొనేందుకు సర్వం సిద్ధమైంది. -
తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు
[ 28-04-2024]
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
మీరెక్కడుంటే.. మేమక్కడుంటాం..!
[ 28-04-2024]
నామపత్రాల దాఖలు పర్వం పూర్తికావడంతో లోక్సభ ఎన్నికల జోరు పెరిగింది.. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
పోలింగ్ శాతం పెంపునకు కృషి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. -
బోర్డు తిప్పేసిన నకిలీ వైద్యుడు
[ 28-04-2024]
జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు. -
ప్రజాస్వామ్యం ఓటుతోనే సాధ్యం
[ 28-04-2024]
ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. -
‘వెంట ఉన్నవాళ్లే ఓట్లేయలేదు’
[ 28-04-2024]
ఓటర్లకు తన పట్ల వ్యతిరేకత లేదని, వెంట తిరిగిన వాళ్లే ఓట్లేయలేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. -
అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
[ 28-04-2024]
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
[ 28-04-2024]
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-04-2024]
ఎన్నికల విధుల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రనవీర్ చంద్ సూచించారు. -
సంక్షేమ పాలన చూసి కాంగ్రెస్కు ఓటేయండి
[ 28-04-2024]
కులం, మతం పేరిట కాదు, కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన చూసి ఓట్లు వేయాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పంచదార పంపిణీ చేయాల్సిందే!
[ 28-04-2024]
చౌక ధరల దుకాణాల్లో ఇక నుంచి పంచదార తప్పనిసరిగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అంకుర సంస్థలు పదేళ్లలో 300రెట్లు పెరిగాయ్: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు