భారాసకు కడియం ఝలక్!
అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు.
కావ్య లేఖతో ఓరుగల్లులో కారు మరింత డీలా
కాంగ్రెస్ తరఫున పోటీ?
ఈనాడు, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల్లోనే వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో భారాసకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడు స్థానాల్లో ఆరు చోట్ల ఓటమి తప్పలేదు. ఒక్క స్టేషన్ ఘన్పూర్లో మాత్రమే గులాబీ జెండా రెపరెపలాడింది. ఆ ఒక్క స్థానంలో గెలిచి పార్టీని కొన ఊపిరితో నిలిపిన కడియం శ్రీహరి సైతం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలతో ఇక తాను ఉండలేననే నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. తండ్రి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకోవాలనుకుని భారాస నుంచి పోటీకి సై అన్న కావ్య అంతలోనే పోటీ నుంచి వైదొలగడం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ పరిణామాలతో లోక్సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి వరంగల్లో భారాసకు ఊహించిన షాక్ తగిలిందని చెబుతున్నారు.
మూడు రోజుల కిందట.. భారాస నుంచి తనకు అవకాశం ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రెండు రోజుల కిందట.. కారులో లోక్సభకు పయనమైన తనకు మద్దతు ఇవ్వాలంటూ హుషారుగా ప్రచారం సాగించారు.
నిన్న రాత్రి.. వెల్లువెత్తుతున్న ఆరోపణలు, భూ కుంభకోణాలతో కుదేలవుతున్న భారాస నుంచి పోటీ చేయలేనని ప్రకటించారు..
వైద్యురాలైన కడియం కావ్య గులాబీ పార్టీకి ఇలా ఝలక్ ఇచ్చారు.. టికెట్టు కూడా పొందాక మనసు మార్చుకుని కారు గుర్తుపై పోటీ చేయనంటూ ప్రకటించడం తీవ్ర సంచలనంగా మారింది.
మరింత ఉత్కంఠ
కడియం కావ్య తండ్రి కడియం శ్రీహరి మార్గనిర్దేశంలోనే ప్రతి అడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో భారాస పోటీ నుంచి విరమించుకోవడం కూడా కడియం సూచనల ప్రకారమే చేశారని సమాచారం. ఆయన కాంగ్రెస్లోకి వెళ్లడం ఖాయమే అన్న చర్చ జోరుగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కీలక నేతలు ఆయనతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది. కడియం శ్రీహరి ఎంతో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. గతంలో భారాస నుంచి వరంగల్ లోక్సభ స్థానంలో ఆయన నెగ్గారు. ఉపముఖ్యమంత్రి పదవి పొందేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన కూతురు కావ్య ఇప్పుడు వరంగల్ లోక్సభ అభ్యర్థిగా పార్టీ అవకాశం ఇవ్వడంతో శ్రీహరి భారాసలోనే కొనసాగుతారని అంతా భావించారు. తాజాగా పార్టీలో జరిగిన పరిణామాలు, కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఇక కడియం సైతం హస్తంతో ‘చేయి’ కలిపేందుకే సిద్ధమైనట్టు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా కావ్యనే బరిలోకి దిగుతారని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో చెప్పాలి?: కేసీఆర్
[ 28-04-2024]
రాష్ట్రంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు కమీషన్లు అడుగుతున్నారని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. -
స్వగ్రామానికి గౌతమ్ మృతదేహం
[ 28-04-2024]
ఈనెల 21న అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలంలోని శివునిపల్లి గ్రామానికి చెందిన పార్శి కమల్ కుమార్ పద్మ దంపతుల పెద్ద కుమారుడు పార్శి గౌతమ్ కుమార్(19) మృతదేహంఏడు రోజుల అనంతరం నేడు స్వగ్రామానికి చేరుకుంది. -
కేసీఆర్ రోడ్ షో నేడు
[ 28-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం వరంగల్ నగరంలో బస్సు యాత్రలో పాల్గొనేందుకు సర్వం సిద్ధమైంది. -
తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు
[ 28-04-2024]
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
మీరెక్కడుంటే.. మేమక్కడుంటాం..!
[ 28-04-2024]
నామపత్రాల దాఖలు పర్వం పూర్తికావడంతో లోక్సభ ఎన్నికల జోరు పెరిగింది.. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
పోలింగ్ శాతం పెంపునకు కృషి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. -
బోర్డు తిప్పేసిన నకిలీ వైద్యుడు
[ 28-04-2024]
జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు. -
ప్రజాస్వామ్యం ఓటుతోనే సాధ్యం
[ 28-04-2024]
ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. -
‘వెంట ఉన్నవాళ్లే ఓట్లేయలేదు’
[ 28-04-2024]
ఓటర్లకు తన పట్ల వ్యతిరేకత లేదని, వెంట తిరిగిన వాళ్లే ఓట్లేయలేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. -
అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
[ 28-04-2024]
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
[ 28-04-2024]
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-04-2024]
ఎన్నికల విధుల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రనవీర్ చంద్ సూచించారు. -
సంక్షేమ పాలన చూసి కాంగ్రెస్కు ఓటేయండి
[ 28-04-2024]
కులం, మతం పేరిట కాదు, కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన చూసి ఓట్లు వేయాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పంచదార పంపిణీ చేయాల్సిందే!
[ 28-04-2024]
చౌక ధరల దుకాణాల్లో ఇక నుంచి పంచదార తప్పనిసరిగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం