ఓట్టేద్దాం..ఓరుగల్లు వైభవాన్ని కాపాడుదాం
ఉమ్మడి వరంగల్ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి.
దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్ 2024 ద్వారా అవకాశం
నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం
ఈనాడు, వరంగల్
రామప్ప దేవాలయం
ఉమ్మడి వరంగల్ అంటేనే అనేక వారసత్వ కట్టడాలకు నిలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, యునెస్కో గుర్తింపు దక్కిన రామప్ప ఆలయం.. కోటగుళ్లు, త్రికూటాలయాలు, మెట్ల బావులు ఎన్నో ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేక వీటిలో కొన్ని మరుగున పడుతున్నాయి. మీరు వాటిని చూసినప్పుడు ‘అయ్యో ఇంత అద్భుత కట్టడాలకు ఈ దుస్థితి ఎందుకు’ అని బాధపడ్డారా? మీరు ఆన్లైన్లో ఒక ఓటు వేస్తే చాలు కేంద్ర ప్రభుత్వం వాటిని బాగు చేసే అవకాశం ఉంది. గురువారం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలా ఓటు వేయాలో వివరిస్తూ ప్రత్యేక కథనం..
ఇదీ వెబ్సైట్
https:///innovateindia.mygov.in/dekho-apna-desh/
పాండవుల గుట్ట
ఏమిటీ కార్యక్రమం?
దేశంలో అనేక రకాల పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వీటిని బాగు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్చిలో జమ్మూకశ్మీర్లో పర్యటించినప్పుడు ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించారు.
5 విభాగాలుగా..
ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, వారసత్వ, ప్రకృతి, అడవులు, సాహసోపేత ప్రాంతాలు, ఇతర ప్రాంతాలుగా అయిదు రకాల సందర్శనీయ స్థలాలను విభజించారు.
ప్రయోజనం ఏమిటి?
ఈ నెల 30 ఓటింగ్కు చివరి తేదీ. ఆ తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి అవకాశాన్ని బట్టి ప్రజలు కోరిన వసతులు కల్పించేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకు పాండవుల గుట్ట వద్ద బస లేదని ఎక్కువ మంది పేర్కొంటే అక్కడ ఒక హోటల్ నిర్మించే అవకాశం ఉంది. వరంగల్ కోటలో పారిశుద్ధ్యం సరిగా లేదని నెటిజన్లు అభిప్రాయపడితే అక్కడి పరిసరాలు బాగు చేసే వీలుంది.
దేఖో అప్నా దేశ్ పీపుల్ చాయిస్ 2024 ధ్రువపత్రం
ఓరుగల్లువాసులు.. వేటికి ఓటేయొచ్చు?
- ఉమ్మడి వరంగల్లో వారసత్వ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న రామప్ప ఆలయం, వరంగల్ కోట, వేయిస్తంభాల గుడిని ఇందులో చేర్చారు. పాండవుల గుట్ట గుహలు కూడా ఉన్నాయి.
- ఆధ్యాత్మిక ప్రదేశాల కింద భద్రకాళి ఆలయం, మెట్టుగుట్ట, ఐనవోలు, కురవి..
- వైల్డ్లైఫ్ కింద ఏటూరునాగారం అభయారణ్యం, పాకాల సరస్సు, రామప్ప చెరువు, లక్నవరం..
- ఇలా ఎన్నో ప్రదేశాలను ఎంపిక చేసి అక్కడ లేని వసతులను ఆన్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. దేశంలో మీరు కోరుకున్న మరే ప్రాంతానికైనా ఓటేయొచ్చు. ఇలా ఓటేసినందుకు మీకు ఒక ప్రశంసా పత్రం కూడా వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏం చేయాలి?
మరుగున పడ్డ పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ఓటింగ్లో పాల్గొనాలి. సైట్లోకి వెళ్లాక ‘ఓట్ నౌ’ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ పేరు, వివరాలు, చిరునామా అందులో నింపాలి. తర్వాత మీరు ఎంపిక చేసే విభాగాల్లోకి వెళ్లి, ఓటేయాల్సిన ప్రాంతం.. ఆ జాబితాలో ఉందో సరిచూసుకోవాలి. అక్కడ కల్పించాల్సిన వసతుల పట్టిక పక్కన ఉంటుంది. దాన్నుంచి ఎంపిక చేసుకోవాలి. రవాణా, పారిశుద్ధ్యం, ఇతర వసతులన్నీ పదిరకాలు ఉంటాయి. వాటిల్లో కావాల్సింది ఎంపిక చేసుకోవాలి.
ఉదాహరణకు వేయిస్తంభాలగుడిని ఎంపిక చేస్తే అక్కడ ఏమేం వసతులు కోరుకుంటున్నారో సైట్లో పొందుపరచవచ్చు.
నేను ధ్రువపత్రం పొందా
- అగ్నిశర్మ గాడేపల్లి, వైద్య విద్యార్థి, హనుమకొండ
ఉమ్మడి వరంగల్లో ఉన్న పలు వారసత్వ ప్రాంతాలు, సహజ వింతల కోసం నేను ఓటేశా. దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్ వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకున్నా. ఓటింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటే మన పర్యాటక ప్రాంతాలు బాగుపడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభ విజయవంతం.. పార్టీ శ్రేణుల్లో ఆనందం
[ 01-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. -
‘పది’లో సత్తా చాటారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు. -
‘సాగునీరు అందించే బాధ్యత నాదే’
[ 01-05-2024]
భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
పదిలో నాలుగో స్థానం..!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
పదిలో 16వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. -
పది మెట్లు పైకి..
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 13వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. -
‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’
[ 01-05-2024]
ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. -
ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
[ 01-05-2024]
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం
[ 01-05-2024]
యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలిపిన వివరాల ప్రకారం.. -
రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 01-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘ఇన్నర్ రింగ్రోడ్డు’ భూ బాధితుల ఆందోళన
[ 01-05-2024]
ఖిలావరంగల్ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగ్ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. -
వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
[ 01-05-2024]
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. -
లోక్సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం
[ 01-05-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
[ 01-05-2024]
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..
తాజా వార్తలు (Latest News)
-
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
-
‘వందే మెట్రో’.. ఫస్ట్ లుక్.. విశేషాలివే!
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్