logo

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

వివాహేతర సంబంధం నేపథ్యంలో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

Published : 26 Nov 2022 06:14 IST

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం నేపథ్యంలో కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. లక్కవరం ఎస్సై దుర్గా మహేశ్వరరావు కథనం మేరకు.. టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన రాచప్రోలు నాగరాజు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తారు అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని కొంత కాలం కిందట ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మొదటి భార్య, పిల్లలు అతడికి దూరంగా ఉంటున్నారు. ఇటీవల రెండో భార్యకు ఉద్యోగం రావడంతో ఆమె టి.నరసాపురంలో ఉంటూ నాగరాజును దూరం పెట్టింది. దీంతో మనస్తాపానికి గురైన అతడు పురుగుల మందు తాగినట్లు ఎస్సై చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని