నిశిరాత్రి దోపిడీలు
నిశిరాత్రి.. చుట్టూ చిమ్మచీకటి.. జాతీయ రహదారిపై దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు కాస్త విశ్రాంతి తీసుకుందామని చిన్న దాబాలు, టీ దుకాణాల సమీపంలో తమ వాహనాలు నిలిపి సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా దాడి.
వాహనదారులను కొట్టి నగదు, నగల అపహరణ
తాజా ఘటనతో జనం భయాందోళన
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే
నిశిరాత్రి.. చుట్టూ చిమ్మచీకటి.. జాతీయ రహదారిపై దూరప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులు కాస్త విశ్రాంతి తీసుకుందామని చిన్న దాబాలు, టీ దుకాణాల సమీపంలో తమ వాహనాలు నిలిపి సేదతీరుతున్న సమయంలో ఒక్కసారిగా దాడి. ఎటువైపు నుంచి వస్తారో తెలియదు.. నలుగురైదుగురు విరుచుకుపడతారు. కారు అద్దాలు పగులకొడతారు.. లోపలున్న వారిని కొట్టి నగలు, నగదు దోచుకుపోతారు. సినిమాలో సన్నివేశాలను తలపించే ఇలాంటి ఘటనలు గతంలో ఏలూరు శివారు జాతీయరహదారిపై జరిగేవి. అలాంటి నేరమే తాజాగా గురువారం తెల్లవారుజామున చోటు చేసుకోవడంతో జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో వరుస ఘటనలు
నగర శివారు జాతీయ రహదారి అంటే గతంలో హడల్.. కలపర్రు టోలు గటు నుంచి ఆశ్రం ఆసుపత్రి వరకు సుమారు 20 కిలోమీటర్ల ఈ మార్గంలో రాత్రివేళల్లో నేరాలు జరిగేవి. వాహనాలను ఆపి దొంగలు దోచుకోవడం, ఆపిన వాహనాల్లోకి చొచ్చుకుపోయి నేరాలకు పాల్పడటం వంటివి చేసేవారు. రెండేళ్ల కిందట కలపర్రు టోలుగేటు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే రెండేళ్ల కిందట ఏలూరు శివారు ఓ బార్ సమీపంలో ఓ డ్రైవర్ తన లారీని రహదారి పక్క ఆపి నిద్రిస్తుండగా దుండగులు దాడి చేసి కత్తితో పొడిచి గాయపరిచారు. నగదు దోచేశారు. ఏడాది కిందట విజయవాడ వైపు వెళ్తున్న ప్రయాణికుడిని లిప్టు అడిగిన ఓ ఆగంతుకుడు మార్గం మధ్యలో నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి దాడి చేసి డబ్బు దోచుకున్నారు. అలాగే ఏలూరు మినీ బైపాస్లో కూడా రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులను అడ్డగించి చరవాణులు, నగదు దోచుకునే వారు.
మళ్లీ మొదలైందా?
వరుస నేరాల నేపథ్యంలో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించి నేరాలకు అడ్డుకట్ట వేయగలిగారు. నగరంలోని బీడీ కాలనీ, చెంచుల కాలనీ, తంగెళ్లమూడి ప్రాంతాలకు చెందిన 19 మందిని అరెస్టు చేశారు. అడపాదడపా చిన్న చిన్నవి జరుగుతున్నా.. మళ్లీ ఇప్పుడు గతాన్ని తలపించేలా నేరం జరగడంతో పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. బాధితుల వద్ద వివరాలు సేకరించి నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం
జాతీయ రహదారిపై నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టాం. ఈ తరహా నేరాలు మళ్లీ జరగకుండా చూస్తాం. దాబా హోటళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఏలూరు ఇన్ఛార్జి డీఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు తెలిపారు.
బెదిరించి 15 కాసుల బంగారం కాజేత
ఏలూరు నేరవార్తలు, న్యూస్టుడే: ఏలూరు నగర శివారు జాతీయ రహదారిలో దారి దోపిడీ జరిగింది. కారులో నిద్రిస్తున్న వ్యక్తులను కొంతమంది దుండగులు బెదిరించి బంగారు ఆభరణాలను కాజేశారు. ఏలూరు గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన బబ్బిత కవిత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరుగుతున్న బంధువుల వివాహానికి తన మనవడు, మరో కుటుంబ సభ్యుడితో కలిసి కారులో బయలు దేరారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటాక ఏలూరు శివారు జాతీయరహదారి పక్కనే ఉన్న రత్నాబార్ సమీపంలోని సర్వీసు రోడ్డులో కారు ఆపి అంతా నిద్రపోయారు. ఈ క్రమంలో కవిత టాయిలెట్కు వెళ్లి వచ్చి.. మళ్లీ కారు ఎక్కుతుండగా కొందరు ఆగంతుకులు వచ్చారు. నగలు, నగదు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఆమె ధరించిన బంగారు హారం, నెక్లెస్, గొలుసు, చెవి దిద్దులతో పాటు 15 కాసుల ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోడేరు ఇసుక రీచ్పై దాడులు
మూడు పొక్లెయిన్లు, నాలుగు వాహనాల స్వాధీనం
ఆచంట, న్యూస్టుడే: అక్రమాలకు అడ్డాగా మారిన ఆచంట మండలం కోడేరు ఇసుక రీచ్పై గురువారం రాత్రి అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నరసాపురం సబ్కలెక్టరు సూర్యతేజ ఆదేశాలతో మండల ఇన్ఛార్జి తహశీల్దారు ఆర్.రాజ్యలక్ష్మి, ఎంపీడీవో జగన్నాథరావు, పెనుగొండ ఎస్సై సురేంద్రకుమార్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది సిబ్బంది ఏకకాలంలో ఈ దాడుల్లో పాల్గొన్నారు. మూడు పొక్లెయిన్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జేపీ సిబ్బందితో పాటు రీచ్ నిర్వహణ చూస్తున్న అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బిల్లులు సైతం లేకుండా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వైనంపై ‘గోదారి గర్భంలో తోడేస్తున్నారు’ శీర్షికతో జనవరి 31న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434