ఫిర్యాదు చేస్తే అరెస్టులా?
జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకోవడంతో పార్టీ నాయకులు, జన సైనికులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టారు.
పోలీసుల తీరుపై జనసేన నేతల నిరసన
భీమవరంలో ఫ్లెక్సీల రగడ
మాట్లాడుతున్న గోవిందరావు, పక్కన అప్పలనాయుడు, శ్రీనివాస్ తదితరులు
భీమవరం పట్టణ, పోడూరు, న్యూస్టుడే: జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకోవడంతో పార్టీ నాయకులు, జన సైనికులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టారు. భీమవరంలోని గోవిందరావు నివాసôలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విడిచిపెట్టారు.
మోహరించిన పోలీసులు
భీమవరం ఒకటో పట్టణంలోని భీమేశ్వరాలయం ఎదురుగా ఉన్న గోవిందరావు నివాస ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున పోలీసు బలగాలు మోహరించాయి. కొద్ది నిమిషాల్లోనే సీఐలు బి.కృష్ణకుమార్, జి.దాసు, నాగప్రసాద్, ఎస్సైలు ఎం.వెంకటేశ్వరరావు, వి.రాంబాబు, పి.అప్పారావు, పోలీసులు చేరుకున్నారు. ఎందుకు వచ్చారు, అరెస్టు ఏమిటి అంటూ గోవిందరావు ప్రశ్నించినప్పటికీ ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6.30 గంటల ప్రాంతంలో పోలీసు వాహనంలోకి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అడ్డుకుంటున్న వారిని పోలీసులు పక్కకు నెట్టి వాహనాన్ని వీరవాసరం మీదుగా పాలకొల్లు నుంచి పోడూరు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు.
వాహనాన్ని వెంబడిస్తూ..
గోవిందరావును తీసుకెళ్తున్న వాహనాన్ని జన సైనికులు ద్విచక్రవాహనాలపై వెంబడించారు. తొలుత కొవ్వూరు స్టేషన్కు తీసుకెళ్లాలనే సంకేతాలున్నప్పటికీ పోడూరుకు చేర్చారు. అక్కడకు వందలాదిగా అభిమానులు చేరుకున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, శాంతియుతంగా ఉండాలని కార్యకర్తలకు గోవిందరావు సూచించారు. ‘అల్లర్లు చేస్తే అధికార వైకాపా వారికి మనకు తేడా ఉండదని’ కార్యకర్తలను శాంతపరిచారు. అనంతరం 10.45 గంటలకు గోవిందరావును స్టేషన్ నుంచి పంపించారు. పార్టీ నాయకులు ఆయనను ఊరేగింపుగా భీమవరానికి తీసుకొచ్చారు. దారిపొడవునా అభిమానులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. జనసేన నేత బండి రమేష్కుమార్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు స్టేషన్లకు తిప్పిన అనంతరం విడుదల చేశారు.
ధర్నాలు, రాస్తారోకోలు
జనసేన పార్టీ అధిష్ఠానం పిలుపు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. భీమవరం, ఉండి, తణుకు, నరసాపురం తదితర చోట్ల జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ పీఏసీ నాయకుడు వేగేశ్న కనకరాజు సూరి, చెనమల్ల చంద్రశేఖర్, జుత్తిగ నాగరాజు, మోకా శ్రీను, సుంకర రవి, కత్తుల నీలేంద్ర, తాతాపూడి రాంబాబు, గుల్లిపల్లి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కైకలూరులో వివాదం
కైకలూరు, న్యూస్టుడే: కైకలూరులో ఫ్లెక్సీ వివాదం రచ్చకెక్కింది. వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు దీటుగా జనసేన నాయకుడు బీవీ రావు ‘రాక్షస పాలనకు అంతం..ప్రజా పాలనకు ఆరంభం’ పేరుతో కొన్నిచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కైకలూరు తాలూకా కూడలిలో బ్యానర్ కడుతున్న ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ ఫ్లెక్సీలు తొలగిస్తే వైకాపా వారివి కూడా తీసివేయాలని జనసైనికులు ప్రతిఘటించారు. కొద్దిసేపటికి పోలీసులు బీవీ రావును కైకలూరు పట్టణ పోలీస్స్టేషన్కు తరలించి రెండు గంటల తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం ఇక్కడి జనసేన కార్యాలయంలో బీవీ రావు విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఏ.రఘు తెలిపారు.
‘ఒక ఫ్లెక్సీ మీరు పెడితే.. మేం పది పెడతాం’
వైకాపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని కలెక్టర్కు, అధికారులకు ఫిర్యాదు చేసినందుకు అరెస్టు చేసినట్టుగా ఉందంటూ జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడూరు పోలీస్స్టేషన్ నుంచి భీమవరం చేరుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డుపెట్టుకుని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఇది పెత్తందారుల దౌర్జన్యం కాదా అని ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకుల ఇసుక దందాలు, దాడుల విషయం ప్రజలకు తెలుసన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేయడంతో జిల్లా అంతటా ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు భయపడి వెనక్కి పంపించారన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్, రెడ్డి అప్పలనాయుడు, బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో జాతీయరహదారిపై నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం