సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు,
ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘ నాయకుల మండిపాటు
మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్
వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్టుడే: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్థానిక సంస్థల ఉనికి లేకుండా చేశారని, అయిదేళ్లుగా సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం నాయకులు మండిపడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధి గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు పలువురు గురువారం రాజమహేంద్రవవరంలోని రివర్బే హోటల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, సుమారు రూ.36 వేల కోట్ల నిధులను ఇతర పథకాలను మళ్లించిందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం, 14, 15 ఆర్థిక సంఘం, జలజీవన్ మిషన్ నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సమకూరక ప్రజలు మండిపడుతున్నారన్నారు. ఈ విషయాన్ని చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ప్రజాప్రతినిధులు సైతం స్థానిక సంస్థలపై నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రతినిధులు నాగాబత్తుల శాంతకుమారి, సుబ్బారావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, స్థానిక పంచాయతీలకు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులకు దామాషా పద్ధతితో నిధులు విడుదలలో జాప్యం చేస్తూ వచ్చిందని విమర్శించారు. 16 డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తున్నామని, వాటిని నెరవేరుస్తామని మేనిఫెస్టోలో ప్రకటించే పార్టీకే తమ సంఘం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, జనసేన నాయకుడు ఉప్పులూరు బాబ్జి, భాజపా నాయకులు పరిమి రాధ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం నాయకురాలు శాంతకుమారి, పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాలడుగుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాలనలో.. శ్రామిక హక్కులకు సంకెళ్లు!
[ 01-05-2024]
ఒక్క అవకాశం ఇస్తే మీ జీవితాలు మార్చేస్తానంటూ గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రామికులను నిలువునా ముంచేశారు. ఏళ్లు గడిచినా హామీలను అమలు చేయకపోగా హక్కులపై గళమెత్తిన కార్మిక నేతలపై జగన్ సర్కారు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది. -
వైకాపాను సాగనంపుదాం..
[ 01-05-2024]
ఎన్డీయే కూటమి శ్రేణుల్లో తెదేపా అధినేత చంద్రబాబు నూతనోత్తేజాన్ని నింపారు. ప్రజాగళంలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం దెందులూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
కూటమి ప్రభుత్వంలో ‘పోలవరం జిల్లా’
[ 01-05-2024]
పోలవరం జిల్లా ఏర్పాటును రానున్న కూటమి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. -
పండుటాకుల ఉసురు పోసుకుంటారా?
[ 01-05-2024]
అధికార వైకాపా పింఛనుదారులతో రాజకీయ జూదం ఆడుతోంది. సచివాలయ సిబ్బంది ద్వారా సునాయాసంగా పంపిణీ చేసే అవకాశం ఉన్నా ససేమిరా అంటూ లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. -
నచ్చకుంటే బదిలీ.. లేదా బలి
[ 01-05-2024]
నచ్చి, వారి అడుగులకు మడుగులొత్తే అందలమెక్కించడం...నచ్చకపోతే నరకం చూపించటం వైకాపా పాలనలో అనవాయితీగా మారింది. ఇష్టారాజ్యంగా బదిలీలు చేయించటం.. డిప్యుటేషన్పై దూరంగా విసిరేయటంతో గత అయిదేళ్లలో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. -
ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేక పరిశీలకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్మిశ్రా అన్నారు. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీ, పార్లమెంటు నియోజకవర్గ పోలీసు పరిశీలకుడు శైలేష్కుమార్ సిన్హా, -
కరెంటు లేక కష్టాలు
[ 01-05-2024]
అసలే ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలవరం ప్రజలు సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. జగన్నాథపేట వద్ద పరివర్తకంలో సమస్యతోపాటు పలు చోట్ల తీగలు తెగిపోవడంతో జగన్నాథపేట, -
‘అసమర్థ సీఎం.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దాం’
[ 01-05-2024]
వైకాపా అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అసమర్థ ముఖ్యమంత్రి.. అహంకారి ఎమ్మెల్యేలను ఇంటికి పంపిద్దామని ఎన్డీయే నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, -
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం
[ 01-05-2024]
వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. పవరుపేటలోని బడేటి విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన 59 ఉప కులాల వారికి జగన్ అన్యాయం చేశారన్నారు. -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
[ 01-05-2024]
దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురై ఓ కుటుంబంలోని ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. -
కక్ష రాజకీయాలు మనకొద్దు
[ 01-05-2024]
అభివృద్ధి అంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉండటమే అని.. తెదేపా, జనసేన, భాజపా కూటమితోనే ఇది సాధ్యమని భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పేర్కొన్నారు. -
కదిలిన కొలువుల గుట్టు
[ 01-05-2024]
వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ తమ చేతివాటం ప్రదర్శించారు. -
5 వరకు సాగునీటి విడుదల
[ 01-05-2024]
డెల్టాలో పంట కాలువలకు మే 5వ తేదీ వరకు నీటి సరఫరా కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తాగునీటి వనరులతో పాటు ఆక్వా చెరువులను యుద్ధప్రాతిపదికన నింపుకొనేందుకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
నియమావళి పాటించాల్సిందే
[ 01-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా నియమావళిని కచ్చితంగా పాటించి తీరాలని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట