ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం
ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ఐక్యత చాటుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని వేతన జీవుల సమస్యలపై చర్చించడమే కాకుండా వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అవలంబించాలనే అంశాలను ప్రస్తావించారు. నేతలు ఏమన్నారంటే.
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం..
- కేఆర్ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
ఉద్యోగులు ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి. కొంతమంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం కాకుండా వారి స్వప్రయోజనాలకు సంఘాలను వాడుకుంటున్నారు. లెక్కకు మిక్కిలిగా సంఘాలు పుట్టుకొస్తుండటాన్ని ప్రభుత్వాలు అవకాశంగా తీసుకుని వారి మధ్య విభజించు- పాలించు అనే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంఘాలనేవి ఉద్యోగుల సంక్షేమానికి పని చేసేవిగా ఉన్నప్పుడే తగిన గుర్తింపు లభిస్తుంది.
ఆర్టీసీని విలీనం చేయాలని అడగలేదు..
- సీహెచ్ సుందరయ్య, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులెవరూ అడగలేదు. గతంలో పదేళ్ల సర్వీసు ఉంటే చాలు పింఛను వర్తించేది. ఆ తర్వాత సంస్కరణల పేరుతో పింఛను సదుపాయాన్ని తొలగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయక ముందు ప్రజలకు సమర్థంగా రవాణా సదుపాయం కల్పించేవారు. విలీనం తర్వాత బస్సుల సంఖ్యతో పాటు రూట్ల సంఖ్య తగ్గింది.
బకాయిలు చెల్లించాలి..
- బి.రవీంద్రరాజు, ఏపీ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు
ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. కొన్ని సంఘాల నాయకులు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండటంతో ఉద్యోగులు నష్టపోతున్నారు. అలాంటి విధానాల్ని సంఘాల నాయకులు మానుకోవాలి. ఉద్యోగులందరికీ ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.