వృథా నీరు...అరికట్టేదెవరు!
ఏకశిలానగరి చెరువు కట్ట రాళ్ల మధ్యలో నుంచి నీరు కారుతూ బయటికి వస్తోంది. కొన్ని రోజులుగా ఇలా జరుగుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రామతీర్థం వద్ద తటాకం అంతర్భాగం నుంచి జలాలు కారిపోతున్నా అడ్డుకట్ట వేయలేదు. అయితే 2001 అక్టోబరు 2న వచ్చిన
మరమ్మతులు పట్టని అధికారులు
ఒంటిమిట్ట చెరువు కట్ట మధ్యలో కారుతున్న జలధార
చెరువు కట్ట రాళ్ల మధ్యలో బయటికి వస్తున్న నీరు
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఏకశిలానగరి చెరువు కట్ట రాళ్ల మధ్యలో నుంచి నీరు కారుతూ బయటికి వస్తోంది. కొన్ని రోజులుగా ఇలా జరుగుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రామతీర్థం వద్ద తటాకం అంతర్భాగం నుంచి జలాలు కారిపోతున్నా అడ్డుకట్ట వేయలేదు. అయితే 2001 అక్టోబరు 2న వచ్చిన వరదలతో రామతీర్థం వద్ద చెరువు మట్టి దెబ్బతింది. అప్పట్లో అధికారులు, రైతులు అప్రమత్తమై బాగు చేయించారు. కడప-రేణిగుంట రహదారి విస్తరణ, అభివృద్ధిలో భాగంగా కట్టను మునుపటి కంటే మరింత బలోపేతం చేశారు. కాకపోతే కోనేరు ఎగువన గతంలో ఎక్కడైతే దెబ్బతిందో అక్కడి నుంచే కట్ట మధ్యలో రాళ్ల నుంచి కొన్నిరోజులుగా జలధార బయటికి వస్తోంది. రామ, లక్ష్మణ తీర్థాల చెంతకు వెళ్లడానికి తాపలు నిర్మించారు. కట్టకు మధ్యలో పిట్ట గోడను ఏర్పాటు చేశారు. మొక్కలు, తీగజాతి ఆకులు అల్లుకున్నాయి. దాంతో నీరు వృథాగా పోతున్నట్లు గుర్తించడం లేదు. మరిన్ని రోజులపాటు నీరు వృథాగా పోతే కట్ట మరింత బలహీనమై పెను ముప్పు జరిగే అవకాశం ఉందని అన్నదాతలు వాపోతున్నారు.
అడ్డుకట్ట వేయాలి..
తటాకం అంతర్గత భాగం నుంచి నీటి ఊట బయటికి రాకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. నీరు కారుతున్న కట్ట ప్రాంతాన్ని గత నెల 20న జలవనరుల శాఖ కడప రెగ్యులర్ డివిజన్ కార్యనిర్వాహక సాంకేతిక అధికారి వెంకట్రామయ్య, ఏఈ సుదర్శన్ పరిశీలించారు. రెండు వారాలు దాటినా ఇక్కడ ఎలాంటి కదలిక లేదు. పనులు చేసినా బిల్లులు సకాలంలో రావని గుత్తేదారులు కూడా చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇప్పటికైనా జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై ఈఈ వెంకట్రామయ్యను వివరణ కోరగా చెరువు కట్ట మధ్య భాగంలో నీరు కారుతున్నట్లు తమ పరిశీలనలో గుర్తించినట్లు చెప్పారు. వెంటనే బాగు చేయిస్తామన్నారు.
గత నెల 20న లీకేజీ ప్రాంతాన్ని ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఈఈ వెంకట్రామయ్య (దాచిన చిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది: వైఎస్ షర్మిల
[ 04-05-2024]
పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తోంది: వైఎస్ షర్మిల
[ 04-05-2024]
జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్