ఖేలో ఇండియా...ఒక్క అడుగూ పడలే!
ఖేలో ఇండియా ప్రాజెక్టు కింద రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక పాఠశాల డాక్టర్ వైఎస్ఆర్ రాష్ట్ర క్రీడాపాఠశాల. ఈ ప్రాజెక్టు కింద అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పాటు జాతీయ శిక్షకులొస్తారని, క్రీడాపాఠశాలకు మహర్దశ పట్టనుందని గత 15 నెలలుగా క్రీడాకారులు
కలగానే మిగిలిపోతున్న ఎక్స్లెన్స్ సెంటర్
15 నెలలుగా పట్టించుకోని క్రీడాధికారులు
హాకీ సాధన చేస్తున్న క్రీడాకారులు (దాచిన చిత్రం)
కేంద్ర ప్రభుత్వ నిధులతో మూడేళ్ల పాటు నిర్వహించే ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద కడప క్రీడా పాఠశాల ఎంపికైంది. దేశ వ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాలను కేంద్రం ఎంపిక చేయగా, అందులో రాష్ట్ర నుంచి ఒక్క క్రీడా పాఠశాలకే స్థానం దక్కింది. ప్రాజెక్టు కింద భవిష్యత్తులో అత్యున్నత ప్రమాణాలతో క్రీడలు అభివృద్ధి చెందడమే కాకుండా జాతీయ స్థాయి పోటీలకు కడప వేదిక కానుంది. కేంద్ర యువజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భారత క్రీడా ప్రాధికార సంస్థ ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద దేశంలోని పలు క్రీడా పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తుంది. మూడేళ్ల పాటు క్రీడలకు కావాల్సిన నిధులు, శిక్షకులను నియమించడం, మౌలిక వసతులను కల్పించడం తదితర సౌకర్యాలను భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే 2020-21 సంవత్సరానికి కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ దేశంలోని 10 క్రీడా పాఠశాలలకుగానూ రాష్ట్రం నుంచి జిల్లాలోని డాక్టరు వైఎస్ఆర్ క్రీడాపాఠశాల ఒకటిగా ఎంపిక చేస్తూ 2020, అక్టోబరు 16న ఉత్తర్వులు విడుదల చేసింది.
ఏటా రూ.3 కోట్లు
ఖేలో ఇండియా ప్రాజెక్టుకు కడప క్రీడా పాఠశాల ఎంపిక కావడంతో ఏటా రూ.3 కోట్ల నిధులను శాయ్ విడుదల చేస్తుంది. నిధులతో జాతీయ శిక్షకులు, అత్యున్నత క్రీడాపరికరాలు, మైదానాలు, స్పోర్ట్స్ సైన్సెస్ అభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా మూడేళ్ల పాటు ఈ నిధులను వెచ్చించి జాతీయ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావడంతో పాటు ఇండోర్ స్టేడియం, బాస్కెట్బాల్, అన్ని ఆటలు అభివృద్ధి చెందుతాయి. నిష్ణాతులైన శిక్షకుల పర్యవేక్షణలో తర్ఫీదు పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏటా దేశంలో జరిగే ఖేలో ఇండియా క్రీడా పోటీలను కూడా క్రీడాపాఠశాలలో నిర్వహించే వీలుంటుంది. క్రీడాశిబిరాల నిర్వహణకు అవకాశం ఉంటుంది.
ప్రత్యేక శిక్షకులొచ్చారు
ఖేలో ఇండియా ప్రాజెక్టులో భాగంగా వెయిట్లిఫ్టింగ్, అథ్లెటిక్స్ క్రీడాంశాలకు ప్రత్యేక శిక్షకులతో పాటు న్యూట్రిషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, మస్సాజర్ ప్రతినిధులు వచ్చారు. ప్రస్తుతం ఉన్న శిక్షకులతోనే శిక్షణ నడుస్తోంది. భవిష్యత్తులో మరింత విస్తరిస్తాం. - ఎం.రామచంద్రారెడ్డి, స్టెప్ సీఈవో, క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది: వైఎస్ షర్మిల
[ 04-05-2024]
పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుల చుట్టూ తిరిగి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్పించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తోంది: వైఎస్ షర్మిల
[ 04-05-2024]
జగన్ హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. -
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు