‘డీడీ అచ్చెన్న మృతిపై సిట్టింగ్జడ్జితో విచారణ జరిపించాలి’
కడప పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టరు డాక్టరు అచ్చెన్న మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండు చేశారు. కడప ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, పక్కన సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, తదితరులు
కడప నేర వార్తలు, న్యూస్టుడే: కడప పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టరు డాక్టరు అచ్చెన్న మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండు చేశారు. కడప ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ అచ్చెన్న కనిపించడం లేదని ఈ నెల 14న కుటుంబసభ్యుల మేరకు కేసు నమోదైన అనంతరం అనుమానితులను విచారణ చేశారా?. వారి రాకపోకలపై నిఘా ఉంచారా?. ఎఫ్ఆర్ఐలో పేర్లు నమోదైన వారి చరవాణులను స్వాధీనపరచుకున్నారా?. అనుమానితులను పిలిచి మాట్లాడారా?’ అని ఆయన ప్రశ్నించారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్ద డీడీ అచ్చెన్న మృతదేహం దొరక్కపోయినట్లయితే ఇప్పటికీ పోలీసులు ఏం చేసేవారు కాదని విమర్శించారు. 10 రోజుల పాటు అచ్చెన్న విషయంలో పోలీసులు ఏం చేశారు’ అని నిలదీశారు. ఈ నెల 14న కేసు నమోదైన అనంతరం 15న మృతుని కుమారుడు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఎస్పీ సైతం కేసులో ఏం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోనే దళిత ఉన్నతాధికారుల ప్రాణాలకు విలువ లేకుంటే సామాన్యులను ఏం కాపాడతారు’ అని ప్రశ్నించారు. ‘అచ్చెన్న అపహరణకు గురైనప్పటి నుంచి మృతదేహం దొరికేవరకు పోలీసులు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండు చేశారు. ‘మృతదేహం దొరక్కపోతే మరో ఏడాదైన కేసు కొలిక్కివచ్చేది కాదు. దళితుల ప్రాణాలకు రాష్ట్రంలో విలువ లేదు. సుభాష్చంద్రతోపాటు నలుగురు పేర్లు ఉన్నాయి. ఆ శాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారి పేరు కూడా ఉంది. అచ్చెన్న లోకాయుక్తలోనూ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి సొంత జిల్లాలో దళిత ఉన్నతాధికారి అదృశ్యమైన కేసును పోలీసులే నిర్వీర్యం చేశారు. కిడ్నాప్ అయిన రోజే పోలీసులు స్పందించి ఉంటే అచ్చెన్న ప్రాణాలతో ఉండేవారు. కుటుంబసభ్యుల ప్రమేయం లేకుండా శవపరీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి స్పందించకుంటే పోరాటాలు చేయాల్సి వస్తుంది’ అని మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. తొలుత ఆయన అన్న మయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజును కలిసిన అనంతరం డీడీ అచ్చెన్న మృతదేహం లభించిన గువ్వల చెరువుఘాట్లో ఘటనాస్థలాన్ని నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయనవెంట సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, పలువురు నాయకులు తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా