రాయచోటిపై తెదేపా ప్రత్యేక దృష్టి
రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు
పలువురు నేతలతోనారా లోకేశ్ సమీక్ష
నారా లోకేశ్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎస్ఎండీ ముస్తాక్ హుస్సేన్
ఈనాడు, కడప : రాయచోటి నియోజకవర్గంపై తెదేపా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను పిలిపించుకుని గెలుపు వ్యూహాలపై చర్చించారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డితో చంద్రబాబు పలుమార్లు మాట్లాడారు. మరో మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డితోనూ చర్చించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మైనార్టీ నేతలకు ప్రాధాన్యమిచ్చే దిశగా ఆ వర్గానికి చెందిన నేతలను లోకేశ్ హైదరాబాద్కు పిలిపించుకుని మాట్లాడారు. వీరిలో తెదేపా సీనియర్ నేత దాదా సాహెబ్ కుమారుడు ఎస్ఎండీ ముస్తాక్ హుస్సేన్తో ప్రత్యేకంగా చర్చించారు. పార్టీలో మైనార్టీ నేతలకు ఉన్న అవకాశాలు వివరించారు. భవిష్యత్తులో పార్టీ ద్వారా కలిగే అవకాశాలు, పునర్విభజనతో నియోజకవర్గాల పెంపు తదితర అంశాలు వివరించారు. ఎన్టీఆర్ హయాం నుంచి మా కుటుంబం, బంధువులు తెదేపాలోనే ఉన్నారని, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ముస్తాక్ హుస్సేన్ వివరించారు. తెదేపా అభ్యర్థి గెలుపు బాధ్యతలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్బాబుతో మదనపల్లెలో చంద్రబాబు బుధవారం రాత్రి సమావేశమయ్యారు. మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని ఆయనకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 మందిపై బైండోవర్ కేసులు
[ 27-04-2024]
మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం పలు గ్రామాలకు చెందిన పది మందిపై బైండోవర్ కేసు నమోదు చేశామని ఎస్సై నాగమురళి తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి
[ 27-04-2024]
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రధానోపాధ్యాయుడు, జేవీవీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.ఖాసింవల్లి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్ తెలిపారు. -
విద్యార్థినికి సన్మానం
[ 27-04-2024]
మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పత్తి కిరణ్ కుమార్ కుమార్తె పత్తి సాయిశ్రీనిజ పదోతరగతి ఫలితాల్లో 594 మార్కులు సాధించింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 27-04-2024]
తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ తెలిపారు. -
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్