నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామరాజు తెలిపారు.
ఈనాడు, కడప: ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు విజయరామరాజు తెలిపారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కడపలోని కలెక్టరు కార్యాలయంలో ఎస్పీ సిద్దార్థ కౌశల్తో కలిసి బుధవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయంలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో కార్యాలయం వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. మిగిలిన వారిని, వాహనాలను 100 మీటర్ల అవతల నిలిపివేస్తామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు ధరావత్తు చెల్లించాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే నామినేషన్ ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ను గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని, నామినేషన్లను ఈనెల 25 వరకు స్వీకరిస్తామని, 26న పరిశీలన, 29న ఉపసంహకరణకు చివరి తేదీ కాగా అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని వివరించారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పునరుద్ఘాటించారు. ఎస్పీ సిద్దార్థ కౌశల్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దులోని అన్ని చెక్పోస్టుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయి భద్రత, వెబ్కాస్టింగ్, అదనపు బలగాలు, అవసరమైన పక్షంలో ప్రత్యేక బలగాలను పంపుతామని తెలిపారు. అభ్యర్థులు అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు.
రాజకీయ పార్టీలన్నీ నిబంధనలు పాటించాల్సిందే
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని కలెక్టర్ విజయరామరాజు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఓటరు స్లిప్పులు పంపిణీ పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. డీఆర్వో గంగాధర్గౌడ్, ఆయా పార్టీల నాయకులు హరిప్రసాద్, భరత్రెడ్డి, మనోహర్, కానుకదానం, లక్ష్మణ్రావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనుడిదే పాపం.. కార్మికుడికి శాపం..!
[ 01-05-2024]
అసంఘటిత, సంఘటిత కార్మికవర్గాల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రతిపక్షనేతగా ఊదరగొట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటమరిచారు. -
దండిగా ప్రభుత్వ పరివారం.. మొండిగా పేదలపై ప్రతీకారం
[ 01-05-2024]
ఏదైనా జరిగితే బాధ్యులెవరు? : వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలామంది కీళ్లు, నరాలు, మోకాలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. -
మైదుకూరు అభివృద్ధిపై నోరెత్తని జగన్
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు. -
కూటమి వాగ్దానాలు... భవిష్యత్తుకు సోపానాలు!
[ 01-05-2024]
‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి. -
నారా లోకేశ్ పర్యటన 5కు వాయిదా
[ 01-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాజంపేట పర్యటన ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. -
నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబం.... మాఫియాలకు నాయకత్వం!
[ 01-05-2024]
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ పర్యటన... జనానికి యాతన!
[ 01-05-2024]
కలికిరిలో మంగళవారం జరిగిన సీఎం జగన్ బహిరంగ సభ పేలవంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు అని షెడ్యూలిచ్చి సాయంత్రం 4 గంటలకు సీఎం సభా స్థలానికి చేరుకున్నారు. -
సమస్యల తిష్ఠ... జగన్ పాలనకు పరాకాష్ట
[ 01-05-2024]
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. -
గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం
[ 01-05-2024]
గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. -
తొలగించని సీఎం స్టిక్కర్
[ 01-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అయినా స్థానిక ముద్దనూరులోని జెండా మాను వీధి, రైల్వే గేటు సమీపంలో, వాటర్ ట్యాంకు సమీపంలోని ఇళ్ల వద్ద గోడలపై ‘మా నమ్మకం నూవ్వే జగన్’ స్టిక్కర్లు ఇప్పటికి అలాగే ఉన్నాయి. -
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగురవేస్తాం
[ 01-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు
[ 01-05-2024]
భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. -
అయిదేళ్ల వైకాపా పాలనంతా మోసం
[ 01-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. -
ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి
[ 01-05-2024]
అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు. -
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. -
అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
[ 01-05-2024]
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య