జగన్ బాటలో బస్సులు.. జనానికి ‘ముప్పు’తిప్పలు!
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు.
గంటలకొద్దీ ప్రయాణికుల నిరీక్షణ
ఆటోలు, ప్రైవేటు వాహనాలే దిక్కు
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెలకు బస్సులు దూరమయ్యాయి... కొత్త బస్సులు రాకపోగా, ఉన్న బస్సులు మరమ్మతులకు గురయ్యాయి... పల్లె బస్సులు రద్దయ్యాయి. అవీ ఎప్పుడొస్తాయో తెలియదు. పల్లెల నుంచి ఆటోల్లో ప్రమాదకర ప్రయాణం సాగించాల్సి వస్తోంది. బస్టాండ్లలో అద్దె బస్సుల హవా పెరిగింది. గతంలో ఉన్న నైట్హాల్ట్ బస్సులు మాయమయ్యాయి. రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను తరలించేందుకు గ్రామీణ ప్రాంత సర్వీసులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయం లేక ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్తూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడిన వారెందరో? క్షతగాత్రుల సంఖ్యకు లెక్కలేదు. ఈ పాపం ఖాతా అంతా వైకాపా ప్రభుత్వానిదే. ఇక జగన్ సభలు జరుగుతున్నాయంటే ప్రయాణికులకు ప్రత్యక్ష నరకమే. జిల్లాలో పల్లెవాసుల ఇక్కట్లను మీరే చూడండి.
పాఠశాలకు వెళ్లాలంటే నడవాల్సిందే
మా గ్రామం నుంచి సుమారు 20 మంది విద్యార్థులు నిత్యం పొట్టిపాడులోని జడ్పీ పాఠశాలకు 7 కి.మీ నడుచుకుంటూ వెళుతున్నారు. గతంలో తాడిపత్రి నుంచి తాళ్లప్రొద్దుటూరు, రేగడిపల్లె, వెంకటాపురం, బురుజుపల్లె, బెడుదూరు మీదుగా యనమలచింతలకు బస్సు సర్వీసు ఉండేంది. పల్లెలకు బస్సు సర్వీస్లు రద్దు చేయడంతో విద్యార్థులు, కూలీలు, గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు.
నారాయణస్వామి, యనమలచింతల
పట్టించుకోని పాలకులు
గతంలో కమలాపురం మీదుగా గంగవరం, విభరాపురం, మొలకోనిపల్లె వరకు ఆర్టీసీ బస్సులు నడిపేవారు. దీంతో ప్రజలు బస్సుల్లో వచ్చి పనులు చూసుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకునేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బస్సులు రద్దు చేయడంతో ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. బస్సులు నడపాలని పలుమార్లు ఫిర్యాదులు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు.
నరసింహులు, గంగవరం
అధిక ఛార్జీలు భరిస్తున్నాం
గతంతో ప్రతి పనికీ ఆర్టీపీపీ నుంచి బసెక్కి ప్రొద్దుటూరుకు వెళ్లేవాళ్లం. చాలారోజులుగా బస్సులు సేవలు నిలిచిపోవడంతో రానుపోను రూ.100 వెచ్చింది ఆటోలో రాకపోకలు సాగిస్తున్నాం. ఆటోలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉంది. అధికారులు స్పందించి బస్సు సర్వీసులు నడపాలి.
కుడుముల వీరమ్మ, ఆర్టీపీపీ, ఎర్రగుంట్ల మండలం
ప్రయాణానికి పాట్లు
మా ఊర్లో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకొని వాటి ద్వారా వస్తున్న ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. అయిదేళ్ల కిందట మా గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సు తిరిగేది. నష్టాలు వస్తున్నాయని ఆపేయడంతో ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. రహదారి మాత్రం వాహనాలు తిరగడానికి అనువుగా ఉంది. అయినా పల్లె బస్సు మా ఊరి వైపు రావడం లేదు. జడ్పీ ఉన్నత పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఆట్లో వెళ్లుతున్నారు. సమయానికి రాకపోవడంతో నిరీక్షణ చేయాల్సి వస్తోంది.
లంకా ఈశ్వర్రెడ్డి, కోనరాజుపల్ల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనుడిదే పాపం.. కార్మికుడికి శాపం..!
[ 01-05-2024]
అసంఘటిత, సంఘటిత కార్మికవర్గాల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రతిపక్షనేతగా ఊదరగొట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటమరిచారు. -
దండిగా ప్రభుత్వ పరివారం.. మొండిగా పేదలపై ప్రతీకారం
[ 01-05-2024]
ఏదైనా జరిగితే బాధ్యులెవరు? : వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలామంది కీళ్లు, నరాలు, మోకాలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. -
మైదుకూరు అభివృద్ధిపై నోరెత్తని జగన్
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు. -
కూటమి వాగ్దానాలు... భవిష్యత్తుకు సోపానాలు!
[ 01-05-2024]
‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి. -
నారా లోకేశ్ పర్యటన 5కు వాయిదా
[ 01-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాజంపేట పర్యటన ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. -
నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబం.... మాఫియాలకు నాయకత్వం!
[ 01-05-2024]
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ పర్యటన... జనానికి యాతన!
[ 01-05-2024]
కలికిరిలో మంగళవారం జరిగిన సీఎం జగన్ బహిరంగ సభ పేలవంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు అని షెడ్యూలిచ్చి సాయంత్రం 4 గంటలకు సీఎం సభా స్థలానికి చేరుకున్నారు. -
సమస్యల తిష్ఠ... జగన్ పాలనకు పరాకాష్ట
[ 01-05-2024]
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. -
గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం
[ 01-05-2024]
గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. -
తొలగించని సీఎం స్టిక్కర్
[ 01-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అయినా స్థానిక ముద్దనూరులోని జెండా మాను వీధి, రైల్వే గేటు సమీపంలో, వాటర్ ట్యాంకు సమీపంలోని ఇళ్ల వద్ద గోడలపై ‘మా నమ్మకం నూవ్వే జగన్’ స్టిక్కర్లు ఇప్పటికి అలాగే ఉన్నాయి. -
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగురవేస్తాం
[ 01-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు
[ 01-05-2024]
భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. -
అయిదేళ్ల వైకాపా పాలనంతా మోసం
[ 01-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. -
ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి
[ 01-05-2024]
అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు. -
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. -
అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
[ 01-05-2024]
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య