logo

భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలి

మండలంలోని శంకవరంలో గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 25 Apr 2024 21:46 IST

కలసపాడు: మండలంలోని శంకవరంలో గురువారం రాత్రి భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జరోశ‌న్న కమలం గుర్తుకు, తెదేపా ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. తెదేపా మండల ప్రధాన కార్యదర్శి భద్రయ్య పార్టీ మండల ఉపాధ్యక్షుడు పట్టాభిరెడ్డి, మాజీ సర్పంచులు బాల వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని