కొలువులు వదిలి కోరుకున్న జీవితం
మనసుకు నచ్చని కొలువు చేయడం కంటే ఇష్టమైన రంగంలో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అంటున్నారీ యువ జంట.
సహజ ఎరువుల తయారీలో యువజంట
సేంద్రియఎరువుల తయారీ కేంద్రం వద్ద అనిత
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, చోడవరం పట్టణం: మనసుకు నచ్చని కొలువు చేయడం కంటే ఇష్టమైన రంగంలో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అంటున్నారీ యువ జంట. తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టి కొత్త ఉపాధికి తాము బాటలు వేసుకున్నారు. తమతో పాటు మరో పది మందికి పని కల్పిస్తున్నారు. వారే అనకాపల్లికి చెందిన రావూరి అనిత, జయచంద్ర.
వ్యవసాయంలో మితిమీరిన రసాయన ఎరువుల వాడకం భూసారాన్ని దెబ్బతీస్తోంది. ప్రజల ఆరోగ్యంపైనా ప్రభావాన్ని చూపుతోంది. వీటి స్థానంలో సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే సేంద్రియ పంటలు పండించే రైతుల సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అనిత, జయచంద్ర సహజ ఎరువుల తయారీకి పూనుకున్నారు. తక్కువ పెట్టుబడితో వ్యర్థాలను ముడి పదార్థాలుగా చేసుకుని ఎరువుల ఉత్పత్తి మొదలుపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా పలు ప్రదర్శనల్లోను పాల్గొంటున్నారు.
చిన్నచిన్న పొట్లాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన సేంద్రియ ఎరువు
కరణం జయచంద్ర బయో టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చెరకు పరిశోధన విభాగంలో పదేళ్లు పనిచేశారు. ఆయన భార్య అనితా ఎం.ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాదులోని జీవీకే సంస్థలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. సేంద్రియ ఎరువుల తయారీపై ఉన్న మక్కువతో సొంతగా ఓ యూనిట్ ప్రారంభించాలనుకున్నారు. దాంతో చేస్తున్న కొలువులకు స్వస్తి చెప్పి వారికి నచ్చిన రంగంలోకి అడుగుపెట్టారు. ఎరువుల తయారీకి కావాల్సిన షెడ్ను అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో నిర్మించారు. పాడి బాగుంటే పంటలు లాభదాయకంగా పండించొచ్చని అనుకున్నారు. దీనికోసం ముందుగా పశువుల పెంపకాన్ని ప్రారంభించారు. వాటి మూత్రం, పేడ, కొబ్బరి పీచు కలిపి వర్మీ కంపోస్టు, కోకోఫిట్ వంటి ఎరువుల తయారీ మొదలుపెట్టారు. సొంతగా ఓ నర్సరీని ఏర్పాటు చేశారు. అందులో పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే మొక్కలను పెంచి విక్రయిస్తున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తూ..
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని వ్యవసాయాధికారులు చెబుతున్నా ఆచరించే రైతులు తక్కువగానే ఉంటున్నారు. దీంతో ఈ యువ జంట కూడా సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి వారిని అటువైపుగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బయట కొనుక్కోవల్సిన అవసరం లేకుండా సొంతంగా సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవచ్చో అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ రకాల పంటలను సాగుచేయడం, అంతర పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. రైతులను తమ క్షేత్రాలకు తీసుకువచ్చి సహజ ఎరువులతో పండే పంటలను చూపించి ప్రోత్సహిస్తున్నారు.
భవిష్యత్తు అంతా సేంద్రియమే..
భవిష్యత్తు తరాలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి సేంద్రియ వ్యవసాయమే ఏకైక మార్గం. ఇప్పటికే సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన రైతులతో కొన్ని సంస్థలు ఒప్పందం చేసుకొని వారికి గిట్టుబాటు ధర చెల్లించి పూర్తి పంటలను కొనుగోలు చేస్తున్నాయి. సేంద్రియ పంటలు పండాలంటే సహజసిద్ధమైన ఎరువులు అవసరం అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాం.
జయచంద్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే