మింగేసిన మూడంతస్తుల మేడ!!
ఇద్దరు పిల్లలతో బతుకుదెరువుకు విశాఖ వచ్చిన కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. అద్దెకు ఉంటున్న ఇంటి రూపంలో ఆశలను సమాధి చేసింది.
అర్ధరాత్రి కుప్పకూలిన భవనం
ముగ్గురు దుర్మరణం
ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు బృందాలు
ఈనాడు-విశాఖపట్నం: ఇద్దరు పిల్లలతో బతుకుదెరువుకు విశాఖ వచ్చిన కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. అద్దెకు ఉంటున్న ఇంటి రూపంలో ఆశలను సమాధి చేసింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఊహించుకొని...పిల్లలే ప్రాణంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు అంతులేని ఆవేదన మిగిల్చింది. అప్పటి వరకూ సంతోషంగా కళ్లముందు తిరిగిన కొడుకు దుర్గాప్రసాద్, కూతురు అంజలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఊహించని పరిణామం. బుధవారం అర్ధరాత్రి జిల్లా పరిషత్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కూలిన దుర్ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కారణం శిథిల భవనమా? అధికారుల నిర్లక్ష్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నగరంలో శిథిల భవనాల పరిశీలనా ప్రక్రియపై అనుమానాలు రేగుతున్నాయి.
వీరి ప్రాణాలు అలా దక్కాయి..
‘ఫాస్ట్ ఫుడ్’ సెంటర్లో పని చేసి ఆలస్యంగా వచ్చిన శివశంకర్... చోటూతో పాటు ఇంట్లో ఉన్నప్పటికీ నిద్ర పట్టకపోవడంతో కొంత మెలకువగా ఉన్నారు. అదే సమయంలో శబ్దాలు వస్తూ ఒక్కో అంతస్తు కుప్పకూలుతుండటంతో గమనించి పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. దీంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చివరి అంతస్తులో ఉంటున్న కృష్ణ, రోజారాణి గాఢ నిద్రలో ఉన్నారు. భవనం కుప్పకూలే సమయంలో పై అంతస్తు వరకు పక్కకు ఒరిగి పడటంతో సమీపంలో ఇంటి నిర్మాణానికి ఉంచిన ఇసుక, మట్టి దిబ్బలపై వీరు పడ్డారు. రోజారాణిపై మంచం పడగా.. సిమెంటు శిథిలాలు మంచంపై పడటంతో ప్రాణాపాయం తప్పింది. అంతస్తు ఒరిగినప్పుడు పక్కనే నిర్మాణంలో ఉన్న భవన పిల్లర్లపై పడినా భార్యాభర్తలిద్దరూ ప్రమాదంలో చిక్కుకునేవారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కూలిన భవనం
నలభై ఏళ్లు నాటిదిగా స్థానికులు చెబుతున్నారు. పైగా ఈ భవనాన్ని ఎలాంటి పిల్లర్లు లేకుండా నిర్మించారు. పునాదులు సైతం తక్కువలోతు తవ్వి ఏకంగా మూడంతస్తుల వరకూ నిర్మించారు. ఈ భవనం ఒమ్మి అప్పారావు పేరుతో ఉండగా, ఆయన తదనంతరం కుమారుల చేతికి వచ్చినట్లు సమాచారం. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అద్దెకు ఇచ్చారు. సాకేటి రామారావు కుటుంబం గత ఆరేళ్లుగా అద్దెకు ఉంటోంది. ఈ పురాతన భవనాన్ని ఆనుకుని ఉన్న మరో పాత భవనం ఇటీవలే పడగొట్టి కొత్త నిర్మాణం చేపడుతున్నారు. పదిరోజుల కిందట ఈ నిర్మాణం సమీపంలో బోరు వేశారు. ఆ సమయంలో ప్రకంపనలు వస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేయడంతో సదరు వ్యక్తులు ఆ సమయంలో నిలిపివేశారు. రాత్రి సమయంలో మళ్లీ మొదలు పెట్టి బోరు వేసి వెళ్లిపోయారని క్షతగాత్రులు చెబుతున్నారు. బోరు వేయడానికి వాల్టా చట్టానికి లోబడే అధికారులు అనుమతులిచ్చారా? లేక అనధికారికంగా వేశారా? అనేది తేలాల్సి ఉంది. కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనానికి సంబంధించి కొన్ని వివాదాలు ఉండటంతో రాత్రిళ్లు చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
పెద్ద శబ్దం వచ్చింది: రాజు
నేను ఆటోడ్రైవరును. రాత్రి భోజనం చేసి పడుకున్నా. కొద్ది సేపటికే పెద్ద శబ్దం వచ్చింది. లేచి చూస్తే పొగ మా ఇల్లంతా కమ్మేసింది. ఆ దూళికి ఇంట్లోవారికి ఊపిరి ఆడనంత పనైంది. వెంటనే బయటకు పంపించేశాను. కళ్లముందు భవనం కుప్పకూలి కనిపించింది. ఆ తర్వాత అందరం కలిసి ప్రాణాలతో ఉన్న వారిని బయటకు తీశాం.
భూకంపం వచ్చిందనుకున్నాం: ప్రకాశ్
భారీ శబ్దం రావడంతో భూకంపం వచ్చిందని భయపడ్డాం. కమ్మేసిన దుమ్ములో ఇద్దరు ప్రాణభయంతో అరుస్తూ కనిపించారు. వాళ్లని దూరంగా తీసుకొచ్చాక, క్షతగాత్రులను ఆసుపత్రికి పంపేందుకు సాయం చేశాం. బుధవారం దుర్గాప్రసాద్ పుట్టినరోజు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడం కలిచివేసింది.
మంచం పడటంతో: రోజారాణి
నిద్రలో ఉండగా రెండో అంతస్తు నుంచి పక్కకు పడిపోయాం. నాపై మంచం పడటంతో బయటపడ్డాను. లేదంటే స్లాబు నాపై పడి ఉండేది. కొన్ని రోజుల క్రితం పక్కనే బోర్ వేశారు. ఆ సమయంలో ఇల్లు కొంత కంపించింది. ఆ తర్వాత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇలా కూలిందేమోననిపిస్తోంది.
చదివి పడుకున్నారు: కన్నప్పడు
ఇంటర్ పరీక్షలకు దుర్గా ప్రసాద్, పదో తరగతి పరీక్షలకు అంజలి రాత్రి వరకూ చదివి పడుకున్నారు.కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. మా అన్న(రామారావు) పిల్లలు ఆగస్టులో గొల్లలమర్రివలస గ్రామానికి వచ్చి నా కూతురు పెళ్లికి హాజరయ్యారు. పదేళ్లుగా విశాఖలోనే ఉంటున్నారు. వదినకు పిల్లలు చనిపోయిన విషయం ఇంకా తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!