మందుబాబులకు కష్టమే..!
సంతానం కలగకపోవడం చాలామందిలో ఉన్న సమస్య. వైద్యరంగంలో ఇదో పెద్ద చర్చ కూడా. ఈ కోణంలో పరిశోధనలు బాగా పెరుగుతున్నాయి. దేశంలో సంతానలేమి 3.9 శాతం నుంచి 16.8 శాతందాకా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఈ తరహా బాధితులున్నారు.
మద్యం బానిసల్లో సంతానోత్పత్తి సమస్య
చెన్నై పరిశోధనలో వెల్లడి
ఈనాడు- చెన్నై
సంతానం కలగకపోవడం చాలామందిలో ఉన్న సమస్య. వైద్యరంగంలో ఇదో పెద్ద చర్చ కూడా. ఈ కోణంలో పరిశోధనలు బాగా పెరుగుతున్నాయి. దేశంలో సంతానలేమి 3.9 శాతం నుంచి 16.8 శాతందాకా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఈ తరహా బాధితులున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రీసెర్చి అండ్ ఎడ్యూకేషన్, చెట్టినాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలోని ఓ పరిశోధన బృందం ఈ కీలక సమస్యపై దృష్టిపెట్టింది. సంతానం లేకపోవడానికి తాగుడు కూడా ఓ ప్రధాన కారణమని నిరూపించింది. దీనిపై వీరు ఓ జర్నల్ను కూడా ప్రచురించారు.
ఇంతకీ ఏం చేశారు..?
ఏడాదిపాటు ప్రత్యేకంగా పరిశీలన జరిపారు. సంతానలేమి సమస్యలతో వచ్చిన కేసుల వివరాల్ని సేకరించడంతో పాటు వారితో మాట్లాడారు. ప్రత్యేకించి 231 మంది మగవారిపై వీరు పరిశోధన చేశారు. సంతానలేమి సమస్యకు తాగుడు ప్రధాన కారణమా కాదా? అని తేల్చేందుకు తమ సర్వేలో మద్యం తాగేవారిని 81 మందిని, మద్యం అలవాటులేనివారిని 150 మందిని తీసుకున్నారు. ఈ రెండువర్గాల వారికీ డబ్ల్యూహెచ్వో ప్రమాణాల ప్రకారం.. సీమెన్ (వీర్య), స్పెర్మ్ (వీర్యకణ) పరీక్షలు నిర్వహించారు. వచ్చిన ఫలితాల్ని విశ్లేషించడంతో పాటు కారణాలపై పరిశోధన చేశారు.
ఆల్కహాల్ ఎంతపని చేసింది..!
మద్యం అలవాటులేనివారితో పోల్చితే మద్యం తాగేవారిలో ఫలితాలు దారుణంగా వచ్చాయి. మద్యం తీసుకునేవారిలో వీర్యం పరిమాణం, వీర్యకణాల నాణ్యత బాగా తక్కువగా ఉన్నట్లు తేలింది. వీరిలో వీర్యకణాల వృద్ధి, వాటి సంఖ్య, చలనశీలతలు బాగా తగ్గిపోయాయని గుర్తించారు. ఎందుకిలా జరుగుతోందన్నదానిపై గత పరిశోధనల్నీ విశ్లేషించుకుని చూశారు. టెస్టోస్టిరాన్ హార్మన్లను విడుదలచేసే వృషణంలోని లెడిగ్ కణాలపై ఆల్కహాల్ ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వీర్యం విడుదలకు కారణమయ్యే లూటినైజింగ్ హార్మోన్ (ఎల్హెచ్), ఫోలికల్ స్టిమ్యూలేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్)పైనా ఆల్కహాల్ ప్రభావముందని తెలిపారు. ఫలితంగా సంతానోత్పత్తి ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలుగుతోందన్నారు. మద్యం తీసుకునే తీవ్రతను బట్టి పురుషుల వీర్యంలో, వీర్యకణాల్లో బలహీనతలు కనపడుతున్నాయన్నారు.
అతిగా తాగారు.. అనుభవిస్తున్నారు
సర్వేలో మద్యం తాగేవారు 21 నుంచి 52 ఏళ్ల వయసు మగవారు ఉన్నారు. వీరంతా పెళ్లయినవారే. ప్రధానంగా 31-40 ఏళ్ల మధ్యవారు మితిమీరి మద్యం తీసుకుంటున్నట్లు వెల్లడైంది. బీర్, వైన్, విస్కీ, బ్రాందీ తదితరాల్ని వీరు తాగుతున్నారు. సర్వేలో పాల్గొన్న 81 మంది మద్యంతాగేవారిలో 36 మంది రోజువారీ ఆల్కహాల్ తీసుకోవడానికి అలవాటుపడ్డారు. వీరి పరీక్షల ఫలితాల్లో వీర్యం పరిమాణం చాలాచాలా తక్కువగా ఉందని తేల్చారు. ఈ ప్రభావం దంపతులకు సంతానం లేకుండా చేస్తోందని పరిశోధకులు భావించారు.
జీవితాల్లో ‘ఆందోళన’ వద్దు
పస్తుత పరిశోధనలో సంతానోత్పత్తి లేకపోవడం మద్యం సేవించడం కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు పరిశోధకులు పీజీ స్కాలర్ తనూజ లెళ్ల, ప్రొఫెసర్లు ఎ.రుక్మిణి, ఎన్.పాండియన్, ఆర్.అరుణ్కుమార్ తెలిపారు. మద్యానికి బానిసలుగా మారినవారిని మెల్లగా మాన్పించే ప్రయత్నం చేయాలని, లేకపోతే వారి జీవితాలు ఆందోళనకరంగా మారొచ్చని చెబుతున్నారు. సంతానం లేకపోవడమనేదే బాధాకర విషయమని వారు ఆవేదన చెందారు.
పరిశోధనలు పెరగాలి
పెళ్లయినవారిలో పిల్లలు పుట్టకపోవడానికి మగవారు కూడా ఓ కారణమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో చాలారకాల కారణాలుంటాయని కూడా సూచిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్ని బట్టి.. హార్మోన్ల సమస్య, పర్యావరణ పరిస్థితులు, మద్యం, పోగాకు తీసుకోవడం లాంటి కారణాలు కూడా ఉండొచ్చని చెబుతున్నారు. ఇలాంటివారిలో తక్కువ వయసప్పుడే బాగా బరువు పెరగడంగానీ, బాగా బరువు తగ్గడంగానీ జరుగుతూ ఉంటుందన్నారు. ఇప్పటిదాకా ఈ కోణంలో విదేశీ పరిశోధనలే ఎక్కువగా ఉన్నాయని, స్వదేశీవి చాలా తక్కువని చెప్పారు. దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!