logo

Crime News: నిద్రిస్తున్న అక్కపై మరిగే నూనె పోసిన చెల్లెలు.. వాళ్లిద్దరి గొడవేంటంటే?

నిద్రిస్తున్న అక్కపై చెల్లెలు మరిగే నూనె పోయడంతో తీవ్రగాయాలైన ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరేష్‌ తెలిపిన వివరాల

Updated : 23 Mar 2022 11:58 IST

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: నిద్రిస్తున్న అక్కపై చెల్లెలు మరిగే నూనె పోయడంతో తీవ్రగాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అక్కాచెల్లెళ్లు చాందినీ, నాగూర్‌బీ భర్తలతో వేరుపడి కాలనీలో నివాసముంటున్నారు. శ్రీను అనే వ్యక్తితో ఇద్దరికీ ఉన్న పరిచయం గొడవకు దారి తీసింది. అక్కపై అక్కసు పెంచుకున్న నాగూర్‌బీ ఆమెపై నూనె పోసింది. ఈ ఘటనలో చాందినీకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని