ఇరుముళ్లంటే ఇంత నిర్లక్ష్యమా!
‘దుర్గగుడికి తరలివచ్చే భవానీ భక్తుల కోసం కనీస ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో.. పవిత్రమైన ఇరుముడి బియ్యాన్ని రోడ్ల పక్కనే పడేసి వెళ్లిపోయే పరిస్థితి దాపురించింది. అమ్మవారి దర్శనాలు చేసుకుని మహామండం నుంచి కిందకు వచ్ఛి. కనకదుర్గానగర్లో రాతి మండపాల పక్కన కుప్పలుగా బియ్యం పోసేసి వెళ్లిపోయారు.
ఈనాడు, అమరావతి
భక్తులు నడిచే దారిలో పోసిన ఇరుముడుల బియ్యం
విజయ దశమి తర్వాత గురు, శుక్రవారాల్లో రెండు రోజులు ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. రెండు రోజుల్లో కనీసం మూడు లక్షల మందికి పైగా భవానీలు తరలివచ్చారు. వీరు తలపై పెట్టుకుని తీసుకొచ్చిన ఇరుముడిలోని బియ్యాన్ని.. ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని అయోమయంలో పడిపోయారు. దాంతో.. గుడి ప్రాంగణంలోనే ఏదో ఒక మూల పెట్టేసి వెళ్లిపోవాలనే భావనతో రోడ్ల పక్కన పడేశారు. ఇరుమడిలోని బియ్యం, పసుపు కుంకుమ, పండ్లు, డబ్బులు.. ఇవన్నీ పడేశారు. నేతి కొబ్బరికాయలను మాత్రం హోమగుండంలో వేసేందుకు తమవెంట పట్టుకుని వెళ్లిపోయారు. ఈ ఏడాది దసరాలో ఇరుముడి స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదంటూ ఆలయం తరఫున ఒక ప్రకటన చేసి వదిలేశారు. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోని భవానీ భక్తులకు సరిగా చేరలేదు. దీంతో వాళ్లు ఇరుముళ్లతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
న్యాయస్థానంలోనూ వాదోపవాదాలు..
దుర్గగుడిలో దసరా ఉత్సవాలకు ఈ దసరాలో లక్షల మంది భవానీలు తరలివస్తున్నారని, వారికోసం ఇరుముళ్ల స్వీకరణ, హోమగుండం ఏర్పాటు చేయాలంటూ.. సుంకర దుర్గారావు, మయూరి రాము, కోరాడ నాగదుర్గాప్రసాద్, మల్లెల బాలకృష్ణారెడ్డి, సల్లా శ్రీనివాసరావు, లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్నాల లక్ష్మణరెడ్డి తదితర గురుభవానీల ఆధ్వర్యంలో న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. దసరాలో ఏటా ఇరుముళ్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారని, ఈసారి కూడా చేయాలంటూ కోరారు. దీనిపై దుర్గగుడి తరఫున వివరణ ఇస్తూ.. గత రెండేళ్లలో కొవిడ్ నేపథ్యంలో భక్తులు తక్కువ వచ్చారని, ఈసారి భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, కనీసం ఐదు లక్షల మంది రావొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అంతమందికి సంబంధించి ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడానికి ఇబ్బంది అవుతుందని వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
[ 20-05-2024]
బాధితుల వేదన ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
[ 20-05-2024]
అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని వైకాపా ఆరోపిస్తోందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. -
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
[ 20-05-2024]
పల్నాడులో జరిగిన అల్లర్లను తానే సృష్టించినట్లు వైకాపా నేతలు విష ప్రచారం చేస్తున్నారని లావు శ్రీకృష్ణదేవరాయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
[ 20-05-2024]
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటమే తన మొదటి లక్ష్యమన్నారు. -
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
[ 20-05-2024]
రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. -
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ