icon icon icon
icon icon icon

మే 3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన!

ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 3, 4వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Updated : 25 Apr 2024 06:46 IST

నాలుగైదు ఎన్డీయే సభల్లో పాల్గొనే అవకాశం

ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 3, 4వ తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల్లో కనీసం నాలుగు లేదా ఐదు ఎన్డీయే బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొనేలా సమాలోచనలు జరుగుతున్నాయి. అనకాపల్లి, రాజమహేంద్రవరం, విజయవాడ, రాయలసీమ ప్రాంతంలో ఒక్కొక్క ఎన్డీఏ సభ జరగనుంది. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు త్వరలో ప్రత్యేకంగా సమావేశమై ప్రధాని పాల్గొనే సభలు, రోడ్‌షోలపై రూట్‌ మ్యాప్‌ ఖరారు చేస్తారని భాజపా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img