మాజీ వాలంటీర్లకు వైకాపా డబ్బు సంచులు!
పోలింగ్ సమీపిస్తున్నవేళ.. రాజీనామాలు చేసిన వాలంటీర్ల చేత ఓటర్లకు డబ్బు పంచేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారు.
ఓటర్లకు పంపిణీ చేయించేందుకు ఏర్పాట్లు
ఐ-ప్యాక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ
ఈనాడు, అమరావతి: పోలింగ్ సమీపిస్తున్నవేళ.. రాజీనామాలు చేసిన వాలంటీర్ల చేత ఓటర్లకు డబ్బు పంచేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారు. ఇందుకోసం మాజీ వాలంటీర్లతో ఐప్యాక్ ప్రతినిధులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి? అందుకోసం అనుసరించాల్సిన విధానం, డబ్బు పంపిణీ తదితర అంశాలపై వాలంటీర్లకు ఐప్యాక్ ప్రతినిధులు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 89,798 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు రాజీనామా చేశారు. శుక్రవారం ఒక్కరోజే 2,265 మంది బయటకొచ్చారు. వాలంటీర్లుగా ఉంటూ వైకాపాకు మద్దతుగా ప్రచారం చేయడం ఇబ్బందికరంగా మారడంతో వారి చేత నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు.
పని చేసిన చోట్లనే..
గ్రామాల్లో 50 ఇళ్లకు, పట్టణాల్లో 100 ఇళ్లకు ఒకరు చొప్పున విధులు నిర్వర్తించిన వాలంటీర్లు... రాజీనామాలు సమర్పించి, అదే చోట్ల తిరిగి వైకాపా కోసం పని చేయనున్నారు. వారి పరిధిలోని కుటుంబాలకు వాలంటీర్లు బాగా పరిచయం ఉన్నందున.. పార్టీ కోసం వారిని వినియోగించుకుని లబ్ధి పొందాలని వైకాపా నేతలు అడ్డగోలు ప్రణాళికలు సిద్ధం చేశారు. వైకాపా మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారం చేసే ముసుగులో మాజీ వాలంటీర్లతో ఓటర్లకు నగదు పంపిణీ చేయించనున్నారు. ఐ ప్యాక్ ప్రతినిధులు వీరితో నిర్వహిస్తున్న సమావేశాల్లో ప్రధానంగా ఇదే విషయంపై సూచనలు చేస్తున్నారు. డబ్బు పంపిణీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలిస్తున్నారు.
మాజీలతో ప్రమాణాలు
ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో ఎలాంటి పొరపాట్లూ చోటుచేసుకోకుండా అందరికీ అందేలా చూస్తామని వాలంటీర్ల చేత... వైకాపా నేతలు ప్రమాణాలు చేయించుకుంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో రెండు, మూడు రోజులుగా మాజీ వాలంటీర్లతో సమావేశాలు నిర్వహిస్తూ... ప్రమాణాలు చేయిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ వాలంటీర్లకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రూ.20 వేలు, ఇంకొన్ని జిల్లాల్లో రూ.25 వేలు చొప్పున... వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు అందించారు. ఓటర్లకు పంపిణీ చేసే నగదులో 10% చొప్పున కమీషన్ ఇస్తామని నేతలు ఆశ చూపుతున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లతోనూ మంతనాలు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)లో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లతోనూ వైకాపా నేతలు కొద్ది రోజులుగా మంతనాలు సాగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూలీలతో ఉపాధి పనులు చేయించడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఒక్కొక్కరి పరిధిలో 200 నుంచి 1,000 మంది కూలీలు పని చేస్తుంటారు. పోటీలో ఉన్న వైకాపా అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు... ఫీల్డ్ అసిస్టెంట్లలను పిలిపించి మాట్లాడుతున్నారు. కూలీల ఓట్లు పడేలా సహకరించాలని... ఇందుకోసం డబ్బు పంపిణీ బాధ్యతనూ తీసుకోవాలని వారిపై ఒత్తిడి పెడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కొందరు... పని ప్రదేశాల్లో వైకాపాకు మద్దతుగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నాలుగైదు రోజులుగా వైకాపా నేతలు ఫీల్డ్ అసిస్టెంట్లతో మంతనాలు సాగిస్తున్నారు.
బరి తెగిస్తున్న రిసోర్స్ పర్సన్లు
పట్టణ ప్రాంతాల్లో స్వయం, సహాయక సంఘాలు, సభ్యుల మధ్య సమన్వయం కోసం పనిచేసే రిసోర్స్ పర్సన్లు అనేక చోట్ల వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తూ బరి తెగిస్తున్నారు. మొన్నటివరకు సంఘాలతో సమావేశాలు నిర్వహించిన వీరు .. కొద్ది రోజులుగా సభ్యుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులకు ఓట్లేయాలని సూచిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, కడప నగరాల్లో రిసోర్స్ పర్సన్లు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM