ఏ-1 కిట్టు.. యథావిధిగా ప్రచారం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఇంకా పోలీసులు వైకాపా కోడ్నే అనుసరిస్తున్నారు. అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు.
హత్యాయత్నం కేసు నమోదుచేసినా.. అరెస్టు చేయరు
తెల్లవారుజాము వరకూ బందరు స్టేషన్లో నాని మంతనాలు
దాడి ఘటనలో బాధితులపై ఎట్రాసిటీ కేసు నమోదు
మచిలీపట్నం అరాచక ఘటనలో పోలీసుల పక్షపాత వైఖరి
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-మచిలీపట్నం క్రైం: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఇంకా పోలీసులు వైకాపా కోడ్నే అనుసరిస్తున్నారు. అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు. మచిలీపట్నంలో గురువారం సాయంత్రం వైకాపా అసెంబ్లీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు జనసేన బీసీ నాయకుడు మహేష్ ఇంట్లోకి వెళ్లి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మహేష్ భార్య హేమలతపై కిట్టు అనుచరులు దాడి చేసి, కుటుంబసభ్యులపైనా పిడిగుద్దులు కురిపించారు. అనంతరం పోలీసుస్టేషన్ వద్ద కూడా దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం సెక్షన్ కింద కేసు పెట్టి.. ఏ1గా చేర్చినా ఇంతవరకూ అరెస్టు చేయలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసినా.. కిట్టు జోలికి వెళ్లేందుకు సాహసించలేదు. అరెస్టయిన వారు కూడా కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. మరోవైపు బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనంగా నిలిచింది.
కిట్టు ఏ1 అయినా..
జనసేన నాయకుడు మహేష్ భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద మచిలీపట్నం పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదుచేశారు. ఈ కేసులో పేర్ని కిట్టును ఏ1గా, ఆయన అనుచరులు.. చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేష్తో పాటు ఇతరులను నిందితులుగా ఎఫ్ఐఆర్లో చూపించారు. హత్యాయత్నం కేసులో ఏ-1 అయిన కిట్టు శుక్రవారం నగర పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు.
వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
ఈ కేసులో కిట్టు మినహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి.. స్థానిక పీడీఎం కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి సమగ్ర విచారణ నిర్వహించాలని పోలీసులను ఆదేశిస్తూ.. వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
స్టేషన్లో నాని మంతనాలు
తన కుమారుడు కిట్టుపై నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం పట్టణ పోలీసుస్టేషన్కు వెళ్లారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో తన అనుచరులతో వెళ్లిన నాని.. తెల్లవారుజామున 2 గంటల వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. హత్యాయత్నం కేసులో మొదటి నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి అన్ని గంటల పాటు స్టేషన్లో సీఐ సతీష్కుమార్తో చర్చలు జరపడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
బాధితులపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు
ఇటీవల వైకాపా నేతలు ప్రతిపక్షాల శ్రేణులపై దాడులు చేయడం, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించడం మామూలైపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఘటనలో దాడికి గురైన బాధితులపైనా పోలీసులు కేసు నమోదుచేశారు. కిట్టు ప్రచారం చేస్తుండగా అకారణంగా కర్రి మహేష్ కుటుంబసభ్యులు తమపై దాడిచేసి, కులదూషణకు పాల్పడ్డారని దాసరి నాగలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో కర్రి మహేష్, కుటుంబసభ్యులు, నాగబాబు, శ్రవణ్కుమార్, శ్యామ్, మరి కొందరిపై పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు.
విచారించి చర్యలు తీసుకుంటాం
- నయీం అస్మి, కృష్ణా ఎస్పీ
ఇరుపక్షాల ఫిర్యాదులపై కేసులు నమోదుచేశాం. కర్రి హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో ఏ-1గా ఉన్న పేర్ని కిట్టు పాత్రపై వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాత చర్యలు తీసుకుంటాం. మహేష్ కుటుంబసభ్యులపై నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుకు సంబంధించి డీఎస్పీ విచారణ అనంతరం చర్యలు చేపడతాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్