icon icon icon
icon icon icon

Pawan Kalyan: పొన్నూరులో పవన్‌ సభ.. రాత్రికి రాత్రే హెలిప్యాడ్‌ను ధ్వంసం చేసిన వైకాపా నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ హెలికాప్టర్‌ ల్యాండ్‌ కావాల్సిన హెలిప్యాడ్‌ను వైకాపా నేతలు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు.

Updated : 04 May 2024 11:14 IST

పొన్నూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవ్వాల్సిన చోట హెలిప్యాడ్‌ను వైకాపా నేతలు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఐలాండ్ సెంటర్‌లో ఆదివారం ఉదయం 9 గంటలకు పవన్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు హెలిప్యాడ్ అనుమతుల కోసం కూటమి నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల సీఎం జగన్‌ పొన్నూరులో బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా స్థానిక సజ్జా ఫంక్షన్ హాల్ వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది ఖాళీగా ఉండటంతో పవన్ కల్యాణ్‌ కూడా అక్కడే ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైకాపా నేతలు.. తాము ఏర్పాటు చేసిన దాన్ని ఎలా వాడుకుంటారంటూ హెలిప్యాడ్‌ను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. దీంతో కూటమి అభ్యర్థులు మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img