వారసత్వమే అర్హత
పోరాటాలకు పశ్చిమ బెంగాల్ వేదిక. ఇక్కడ క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలుగా పని చేసి నేతలుగా ఎదుగుతారని పేరు. కానీ ఆ సంప్రదాయం క్రమంగా మారిపోతోంది.
బెంగాల్లో కొత్త రాజకీయం
అన్ని పార్టీలదీ అదే బాట
గతానికి భిన్నంగా కొత్త నేతల రాక
పోరాటాలకు పశ్చిమ బెంగాల్ వేదిక. ఇక్కడ క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలుగా పని చేసి నేతలుగా ఎదుగుతారని పేరు. కానీ ఆ సంప్రదాయం క్రమంగా మారిపోతోంది. వారసత్వ రాజకీయాలకు ఆ రాష్ట్రం ఇప్పుడు పెద్ద పీట వేస్తోంది. గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా వారసులు బరిలోకి దిగారు. రాష్ట్రంలోని 42 నియోజకవర్గాల్లో 13 చోట్ల వారసులు తలపడుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు వారసులకే పార్టీలు టికెట్లు ఇచ్చాయి.
విద్యార్థి రాజకీయాల నుంచి..
విద్యార్థి రాజకీయాలతో ప్రతిధ్వనించే పశ్చిమ బెంగాల్ క్రమంగా కుటుంబ రాజకీయాల దిశగా సాగుతోంది. వారసత్వ నేతలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘ఇది బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. వర్గ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల దిశగా రాష్ట్రం సాగుతోంది. గతంలో ఎన్నడూ ఇంతమంది వారసులు ఎన్నికల్లో పోటీ చేయలేదు’ రాజకీయ అధ్యయన వేత్త మైదుల్ ఇస్లాం పేర్కొన్నారు. గతంలో బెంగాల్లో రాజకీయాలను జనాదరణ కలిగిన నేతలు నియంత్రించేవారని, పార్టీ గుర్తులు, రాష్ట్రంలోని వివిధ అంశాలు ప్రభావితం చేసేవని, అలాంటి రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలను ప్రజలు ఎలా ఆదరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
విద్యార్థి నేతలకు కాలం చెల్లిందా?
పశ్చిమ బెంగాల్ విద్యార్థి నేతలకు ఆలవాలం. మమతా బెనర్జీ, బుద్ధదేవ్ భట్టాచార్య, బిమన్ బోస్, సోమేన్ మిత్రా, ప్రియరంజన్ దాస్ మున్షీ తదితరులు విద్యార్థి నేతలుగా పని చేసినవారే. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల నుంచి నేతలు రావడం లేదు. దీంతో వారసత్వ రాజకీయాలు విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రెసిడెన్సీ కళాశాల, జాదవ్పుర్ విశ్వవిద్యాలయంలో మాత్రమే విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా వాటికి గత ఐదేళ్లుగా ఎన్నికల్లేవు. దీంతో నేతలు ఆవిర్భావించడం లేదు.
అన్ని పార్టీల నుంచీ..
రాష్ట్రంలో పోటీ చేస్తున్న అన్ని పార్టీలూ వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు వారసులు బరిలో ఉన్నారు. వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేసే భాజపా, సీపీఎం ఇద్దరేసి వారసులకు టికెట్లు ఇచ్చాయి.
వారసులకు టికెట్లు ఇవ్వడంలో పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయని తృణమూల్, భాజపా, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కుటుంబ సభ్యులైతే విధేయులుగానూ, విశ్వాసపాత్రులుగానూ ఉంటారని, నమ్మదగిన వారిగా నిలుస్తారని అంటున్నారు.
రాజకీయాల్లో కుటుంబ సభ్యుల విజయానికి రెండు ప్రధాన కారణాలుంటాయంటున్నారు. పేరును గుర్తించడంతోపాటు ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటంవల్ల ఎన్నికల్లో గట్టి మద్దతు లభిస్తుందని తృణమూల్ నేత ఒకరు తెలిపారు.
ముందు వరుసలో తృణమూల్
- ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారసుడిగా రాజకీయాల్లోని వచ్చిన తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మూడోసారి బరిలోకి దిగారు.
- ఉలుబెరియా నుంచి సిటింగ్ ఎంపీ సజ్దా అహ్మద్ పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ సతీమణి.
- జేనగర్ నుంచి ప్రతిమా మండల్ మరోసారి బరిలో ఉన్నారు. ఆమె మాజీ ఎంపీ గోబింద చంద్ర నస్కర్ కుమార్తె.
- బర్దమాన్-దుర్గాపుర్ నుంచి మాజీ క్రికెటర్, ఎంపీ కీర్తి ఆజాద్ పోటీ చేస్తున్నారు. గతంలో భాజపా ఎంపీగా పని చేసిన ఆయన తృణమూల్ నుంచి బరిలోకి దిగారు. ఆయన తండ్రి బిహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్.
- డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, న్యాయవాది పిల్లలు న్యాయవాదులు అయినప్పుడు రాజకీయ నేతల వారసులు రాజకీయాల్లో పాల్గొనడం తప్పెలా అవుతుందని తృణమూల్ నేత శాంతనూ సేన్ ప్రశ్నిస్తున్నారు. అర్హతల విషయంలో రాజీ పడినప్పుడే వారసత్వ రాజకీయాల్లో ఇబ్బంది ఎదురవుతుందని, లేకుంటే ఇబ్బందేమీ ఉండదని ఆయన అంటున్నారు.
భాజపా తరఫున..
- కాంఠీ లోక్సభ స్థానం నుంచి భాజపా తరఫున సౌమేందు అధికారి బరిలో నిలిచారు. ఆయన తూర్పు మేదినీపుర్ ప్రాంతంలో శక్తిమంతమైన అధికారి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి శిశిర్ అధికారి ఈ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
- బోంగావో నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న శాంతను ఠాకుర్.. మతువా ఠాకుర్బాడీ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి మంజుల్ కృష్ణ ఠాకుర్ తృణమూల్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఆయన సమీప బంధువు మమతా బాలా ఠాకుర్ తృణమూల్ ఎంపీగా పని చేశారు.
కాంగ్రెస్ నుంచి..
- క్షిణ మాల్దాలో 2006 నుంచి ఎంపీగా గెలుస్తున్న అబు హసేం ఖాన్ చౌధురి కుమారుడు ఇషాఖాన్ చౌధురికి ఈ సారి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఘనీఖాన్ చౌధురి సోదరుడే అబు హసేం ఖాన్.
- పురూలియా నుంచి కాంగ్రెస్ తరఫున నేపాల్ మహతో బరిలోకి దిగారు. ఆయన మాజీ ఎంపీ దేబేంద్ర మహతో కుమారుడు.
- జాంగీపుర్ నుంచి మాజీ మంత్రి అబ్దుస్ సత్తార్ మనవడు మోర్తాజా హొస్సేన్ పోటీ చేస్తున్నారు.
- ‘నేనూ ఎమ్మెల్యేగా గెలిచి 15 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నా’ అని రాయ్గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి అలీ ఇమ్రాన్ రాంజ్ తెలిపారు. ఆయన సీనియర్ ఫార్వర్డ్ బ్లాక్ సీనియర్ నేత మహమ్మద్ రంజాన్ అలీ కుమారుడు. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన హఫీజ్ ఆలం సైరానీ మేనల్లుడు.
సీపీఎం తరఫున..
దక్షిణ కోల్కతా సీపీఎం అభ్యర్థి సారియా షా హలీం కూడా రాజకీయ వారసురాలే. ఆమె మామ హషీం అబ్దుల్ హలీం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్గా సుదీర్ఘకాలం పని చేశారు. ఆమె భర్త ఫవాద్ హలీం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు.
శ్రీరాంపుర్ సీపీఎం అభ్యర్థి దీప్సితా ధర్ యువ నేత. ఆమె గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మ నిధి ధర్ మనవరాలు.
సమర్థన
రాజకీయ వారసులను బరిలో దింపడాన్ని భాజపా, సీపీఎం సమర్థించుకుంటున్నాయి. వారికి కుటుంబాలవల్లే టికెట్లు ఇవ్వలేదని, సమర్థతను చూశామని చెబుతున్నాయి.
- ‘సారియా షా హలీం, దీప్సిత ధర్లు మంచి వక్తలు. వారికి వారసత్వం అనేది అర్హత కాదు’ అని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి స్పష్టం చేశారు.
- ‘వారసత్వ రాజకీయాలకు మా పార్టీ వ్యతిరేకం. శాంతను ఠాకుర్, సౌమేందు అధికారి సుప్రసిద్ధ రాజకీయ నేతలు’ అని భాజపా నేత సమీక్ భట్టాచార్య తెలిపారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోరాహోరీ స్థానాల్లో ఉద్ధృత ప్రచారంతో ఢీ
తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు నియోజకవర్గాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించి పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లు తెలిసింది. -
నాగర్ కర్నూల్లో ఎవరి ధీమా వారిదే
నాగర్కర్నూల్.. దక్షిణ తెలంగాణలో కీలకమైన లోక్సభ నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. అతిపెద్ద నల్లమల అటవీ ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోనిదే. సరిహద్దు నుంచి కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయి. -
ఎవరికో ‘వరం’గల్..!
సాంస్కృతిక రాజధాని.. పర్యాటక కేంద్రాల నిలయం.. కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లులో లోక్సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. -
గులాబీకి.. సవాలే
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసకి.. వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికలు సవాలుగా మారాయి. -
మైనార్టీల అడ్డాలు!
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. -
దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్
మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమై... ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్న భరోసా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తోంది. -
కులం చూసి.. టికెట్ కేటాయింపు!
అభ్యర్థుల ఎంపికలో తాము వారి కులాలకు ప్రాధాన్యమివ్వలేదనేది రాజకీయ పార్టీలు తరచూ చెప్పే మాట! కానీ అందులో వాస్తవం లేదంటున్నారు విశ్లేషకులు. -
కీలక నేతలకు అగ్ని పరీక్ష
కీలక నేతలు బరిలో నిలిచిన మూడోవిడత పోలింగ్ ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ నెల 7న 93 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 9 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల్లోని అగ్రనేతలు పోటీలో ఉన్నారు. -
చిన్న నియోజకవర్గాల్లో పెద్ద పోరు
దేశంలోని అతి చిన్న నియోజకవర్గాల్లో ఉన్న దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్లలో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది. -
కంచుకోటలో కొత్త గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేఠీ సీటును కాదని ఇప్పుడు రాయ్బరేలీని ఎంచుకోవడంతో అందరి దృష్టీ ఆ నియోజకవర్గంపైకి మళ్లింది. -
మెతుకు సీమలో మెరిసేదెవరో..?
మంజీర నీటితో రాజధాని గొంతులో అమృతాన్ని నింపిన సింగూరు డ్యాం.. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పటాన్చెరు.. ప్రఖ్యాత చర్చి.. ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా నిలుస్తూ.. ‘మెతుకు సీమ’గా పేరొందిన మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. -
ప్రచారం వాడీ…వేడిగా
‘నాలుగు గడపలు తిరిగి.. రెండు కూడళ్లలో సమావేశాలు పూర్తి చేయగానే గొంతెండిపోతోంది. నెత్తి చెమటలు పడుతోంది. -
ఈవీఎంలో చివరిదే గానీ.. చిన్నది కాదు: ప్రజల మాటే ఈ ‘నోటా’
ఎన్నికల్లో అభ్యర్థులందరూ అందరే అన్నట్లు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఏకైక ఆయుధం నోటా. 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రజలు దీనిని వాడారు. ఈసారి ఎన్నికల్లో ఇది మరింత పదునెక్కే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో హోరాహోరీ.. రాహుల్ వర్సెస్ దినేశ్..!
రాహుల్ రాయ్బరేలీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గాంధీ కుటుంబం తమ కంచుకోటలోని ‘పంచవటి’ నేతతో తలపడనుంది. -
హస్తానికి తిరుగుబాటు తలపోట్లు
పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్సింగ్ లవ్లీ ఇటీవల షాకిచ్చారు. -
ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..
ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. -
దిగ్గజాల బరి
మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల పోటీ నడుమ మధ్యప్రదేశ్లోని 9 నియోజకవర్గాలు మూడో విడతలో భాగంగా 7వ తేదీన పోలింగ్కు సిద్ధమవుతున్నాయి. -
భువనగిరి కోట ఎవరి పరం..!
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. -
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్కీబాత్ కుర్రాడు..!
ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్లో ఓ యువ కళాకారుడి పేరు ప్రస్తావించారు. తాజాగా ఆ కుర్రాడికే ఒకప్పుడు తాను పోటీ చేసిన వడోదర టికెట్ ఇచ్చారు. -
‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్జీగా పేరొందిన భాజపా సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)లు తలపడుతున్నారు.
తాజా వార్తలు
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్