చేజారిన సీఎం పదవి
పట్లోళ్ల రామచంద్రారెడ్డిది కొండాపూర్ మండలం మారేపల్లి. పట్లోళ్ల లక్ష్మారెడ్డి, వీరమ్మల మూడో సంతానం.
న్యాయవాదిగా రాజకీయాల్లోకి..
పి.రామచంద్రారెడ్డి
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, కొండాపూర్: పట్లోళ్ల రామచంద్రారెడ్డిది కొండాపూర్ మండలం మారేపల్లి. పట్లోళ్ల లక్ష్మారెడ్డి, వీరమ్మల మూడో సంతానం. న్యాయవాది వృత్తి చేపట్టిన ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారు. 1959లో పటాన్చెరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా, ఏపీఎస్ ఆర్టీసీ పాలకవర్గ సభ్యుడిగా పని చేశారు. 1962, 1972, 1983, 1985, 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
స్పీకర్గా ఉన్న సమయంలో..
1989లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక 1990 జనవరి 4న శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. అదే ఏడాది ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం కల్పించనున్నారని జోరుగా ప్రచారం సాగింది. నిస్వార్థ నేతగా పేరుండగా, న్యాయవాది కూడా కావడంతో ఆయనకు పదవి ఖాయమని అంతా భావించారు. తీరా పార్టీ అధిష్ఠానం సీల్డ్ కవర్లో నేదురుమల్లి జనార్దన్రెడ్డి పేరు పంపడంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. నేదురుమల్లి మంత్రివర్గంలో ఆయనకు భారీ పరిశ్రమల శాఖ బాధ్యతను అప్పగించారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖనూ అప్పగించారు. కానీ అది రెండు నెలలకే పరిమితమైంది. సాక్షాత్తు సీఎం పేషీ నుంచి వచ్చిన దస్త్రాన్ని రామచంద్రారెడ్డి వెనక్కి పంపడమే కారణమని చెబుతారు.
మారేపల్లిలో రామచంద్రారెడ్డి స్వగృహం
సొంతూరికి ‘తొలి’ ప్రాధాన్యం
స్వగ్రామమైన మారేపల్లికి నియోజకవర్గంలోనే తొలిసారిగా విద్యుత్తు వసతి కల్పించారు. పూరిళ్లు లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు 9 ఎకరాల విస్తీర్ణంలో ప్రణాళికతో కూడిన ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. తల్లి వీరమ్మ స్మారకార్థం ఆయుర్వేద ఆసుపత్రిని నిర్మించారు. ఇలా నిక్కచ్చి ఉన్న వ్యక్తిగా పేరొంది నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!