గుత్తా రాజకీయ మలుపు.. కొండ నుంచే
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి రాజకీయ అరంగేట్రం స్వగ్రామం నుంచే మొదలైనా.. కీలక మలుపు తిప్పింది మాత్రం దేవరకొండ రాజకీయాలే.
గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి రాజకీయ అరంగేట్రం స్వగ్రామం నుంచే మొదలైనా.. కీలక మలుపు తిప్పింది మాత్రం దేవరకొండ రాజకీయాలే. దేవరకొండ నుంచి జడ్పీటీసీగా గెలుపొందిన తర్వాతే ఆయనకు రాష్ట్రస్థాయిలో డెయిరీ ఛైర్మన్, ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీగా అవకాశాలు రావడం సెంటిమెంట్గా భావిస్తారు. అందుకే ఆది నుంచి ఆయనకు దేవరకొండ అంటే అమితమైన ప్రేమ. గుత్తా సుఖేందర్రెడ్డి సొంత గ్రామం చిట్యాల మండలం ఉరుమడ్ల నుంచి 1981లో గ్రామపంచాయతీ సభ్యుడిగా ఎన్నికవడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం 1984-85 వరకు చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్గా, 1992లో సింగిల్ విండో ఛైర్మన్గా ఎన్నికయ్యారు. నాటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ముఖ్య సహచరునిగా ఉంటూ నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి లక్ష్యంతో.. 1995 మార్చి 10న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో దేవరకొండ జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. దేవరకొండలో వాపపక్ష పార్టీల ప్రభావం ఎక్కువ. దేవరకొండకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో అప్పటి వరకు తెదేపా గెలవలేదు. అయినా జడ్పీటీసీ ఎన్నికల్లో సీపీఐ నేత పల్లా వెంకట్రెడ్డిని ఓడించి గుత్తా సుఖేందర్రెడ్డి సంచలనం సృష్టించారు. అప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్ పదవి దక్కలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్, ఏపీడీడీసీఎఫ్ ఛైర్మన్గా 1995-99 వరకు పనిచేశారు. 1999-2004 వరకు తెదేపా తరఫున నల్గొండ ఎంపీగా పనిచేశారు. అనంతరం వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి 2009 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2019-21 వరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా.. రెండోసారి 2021 డిసెంబరులో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
దేవరకొండ, న్యూస్టుడే
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. -
లోక్సభ ఎన్నికలు.. తొలినాళ్లలో ఎన్నెన్నో వింతలు!
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ మొదలైన తొలినాళ్లలో దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పలు వింత, హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. -
ఇంటి నుంచి ఓటు.. అర్హులు ఎవరు? దరఖాస్తు ఎలా?
లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. -
General elections: నేను ఫలానా వారి భార్యను!
భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. -
డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. -
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
Adolf Lu Hitler - John F Kennedy: కొన్నేళ్ల క్రితం అడాల్ఫ్ హిట్లర్ను జాన్.ఎఫ్. కెనడీ అరెస్టు చేశారట. దీని గురించి ఈసీ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ దీని వెనక కథేంటీ?
తాజా వార్తలు
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM