divorce: ఆ దేశంలో విడాకులు తీసుకోలేరు!
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం.. విడాకులు తీసుకుని ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం.. విడాకులు తీసుకుని ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. అలాంటి పద్ధతి ఈ మధ్య భారత్లోనూ మొదలైంది. వివాహమై కొన్ని నెలలైనా గడవక ముందే చిన్న చిన్న విషయాలకే గొడవ పడి కోర్టుమెట్లు ఎక్కుతున్న జంటలు ఉన్నాయి. తమ మధ్య విభేదాలొచ్చి విడిపోవాలని కోరుకునే దంపతులకు అధికారికంగా విడాకులు తీసుకోవడానికి అన్ని దేశాల్లోనూ చట్టాలున్నాయి. కానీ ప్రపంచంలో విడాకులు తీసుకోవడానికి వీలులేని ఏకైక దేశం ఫిలిప్పీన్స్. ఎందుకో తెలుసా?
మత విశ్వాసాలే కారణమా?
ఫిలిప్పీన్స్లో చాలామంది క్రైస్తవ క్యాథలిక్లే ఉన్నారు. క్యాథలిక్ పద్ధతులను పాటించే వారు విడాకులను వ్యతిరేకిస్తుంటారు. అందుకే అక్కడి నేతలు తమ దేశ చట్టాల్లో విడాకుల అంశాన్ని చేర్చలేదు. ముఖ్యంగా అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడైన బనినో అక్వినో విడాకులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. విడాకుల చట్టాలు లేకపోవడంతో అక్కడి ప్రజలకు చట్టబద్ధంగా విడిపోవడానికి అవకాశమే లేదు. 2015లో పోప్ ఫ్రాన్సిస్ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు విడాకులు కోరుకుంటున్న దంపతుల విషయంలో సానుకూలంగా స్పందించమని ప్రభుత్వానికి సూచించారు. కానీ ఆ దేశ ప్రజలు విడాకులు తీసుకోవడాన్ని అగౌరవంగా భావిస్తుంటారు. అందుకే పోప్ అభ్యర్థనను సైతం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రపంచంలో విడాకులే లేని దేశం తమదని గర్వంగా చెప్పుకోవాలనేదే అక్కడి నేతల కోరిక.
మధ్యలో తెచ్చిన చట్టాలు మధ్యలోనే మాయం!
ఫిలిప్పీన్స్ను మొదట్లో స్పెయిన్ స్వాధీనం చేసుకొని కొన్ని శతాబ్దాలు పాలించింది. ఈ క్రమంలో ఆ దేశ ప్రజలు క్యాథలిక్ క్రైస్తవులుగా మారారు. దీంతో క్యాథలిక్ సంప్రదాయాలు, కట్టుబాట్లు వారిలో జీర్ణించుకుపోయాయి. అందుకే విడాకులు తీసుకోవడాన్ని వారు అగౌరవంగా భావిస్తారు. అధికారికంగా వారు విడిపోలేరు. కాబట్టి ఎవరైనా సరే.. భార్య/భర్త నుంచి విడిపోయి వేరుగా ఉండలేరు. ఒకవేళ ఎవరైనా అలా విడిగా ఉంటే, వారిని నీచంగా చూస్తారు. అయితే, 1898లో స్పానిష్-అమెరికా యుద్ధం జరిగింది. అప్పుడు స్పెయిన్ అధీనంలో ఉన్న ఫిలిప్పీన్స్ అమెరికా హస్తగతమైంది. ఆ తర్వాత అమెరికా పాలకులు ఫిలిప్పీన్స్లో విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టారు. అయితే, విడాకులు తీసుకోవడానికి ఒకే ఒక నిబంధన పెట్టారు. భార్యభర్తల్లో ఎవరో ఒకరు వ్యభిచారం చేస్తున్నట్లు తేలితేనే విడాకులు మంజూరు చేయాలని చట్టం చేశారు.
రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఫిలిప్పీన్స్ను జపాన్ ఆక్రమించింది. అమెరికా చేసిన విడాకుల చట్టాన్ని జపాన్ రద్దు చేసి మరో చట్టం తెచ్చింది. కానీ అది కూడా ఎక్కువ రోజులు అమలులో లేదు. 1944లో తిరిగి అమెరికా ఫిలిప్పీన్స్ను ఆక్రమించుకోవడంతో పాత విడాకుల చట్టాన్నే తిరిగి అమల్లోకి తెచ్చింది. కాగా.. 1946లో అమెరికా నుంచి స్వాతంత్ర్యం పొందిన ఫిలిప్పీన్స్ అమెరికా, జపాన్ చేసిన చట్టాలను తొలగించింది. అసలు తమ దేశ చట్టాల్లో విడాకులన్న పదమే లేకుండా చేసింది. అయితే, ఆ దేశంలోని మైనార్టీ ముస్లింలు మాత్రం తమ మతాన్ని అనుసరించి విడాకులు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం వీలు కల్పించింది.
విడాకుల చట్టం ప్రతిపాదనలు.. విమర్శలు
విడాకులను చట్టబద్ధం చేయడానికి పలుమార్లు విడాకుల ముసాయిదా బిల్లు రూపొందించినా ఇప్పటికీ దానికి చట్టసభల్లో ఆమోదముద్ర పడలేదు. కొన్ని నెలల కిందట రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లును జనాభా, కుటుంబ సంబంధాలశాఖ కమిటీ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని దాని రూపకర్తలు చెబుతున్నారు. దీనికి చట్టసభల్లోనూ ఆమోదం లభించాలని కాంక్షిస్తున్నారు. మరోవైపు క్యాథలిక్ పద్ధతులను అనుసరించే పాలకులు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఆమోదిస్తే వివాహం, కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని అంటున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్