divorce: ఆ దేశంలో విడాకులు తీసుకోలేరు!
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం.. విడాకులు తీసుకుని ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం.. విడాకులు తీసుకుని ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. అలాంటి పద్ధతి ఈ మధ్య భారత్లోనూ మొదలైంది. వివాహమై కొన్ని నెలలైనా గడవక ముందే చిన్న చిన్న విషయాలకే గొడవ పడి కోర్టుమెట్లు ఎక్కుతున్న జంటలు ఉన్నాయి. తమ మధ్య విభేదాలొచ్చి విడిపోవాలని కోరుకునే దంపతులకు అధికారికంగా విడాకులు తీసుకోవడానికి అన్ని దేశాల్లోనూ చట్టాలున్నాయి. కానీ ప్రపంచంలో విడాకులు తీసుకోవడానికి వీలులేని ఏకైక దేశం ఫిలిప్పీన్స్. ఎందుకో తెలుసా?
మత విశ్వాసాలే కారణమా?
ఫిలిప్పీన్స్లో చాలామంది క్రైస్తవ క్యాథలిక్లే ఉన్నారు. క్యాథలిక్ పద్ధతులను పాటించే వారు విడాకులను వ్యతిరేకిస్తుంటారు. అందుకే అక్కడి నేతలు తమ దేశ చట్టాల్లో విడాకుల అంశాన్ని చేర్చలేదు. ముఖ్యంగా అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడైన బనినో అక్వినో విడాకులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. విడాకుల చట్టాలు లేకపోవడంతో అక్కడి ప్రజలకు చట్టబద్ధంగా విడిపోవడానికి అవకాశమే లేదు. 2015లో పోప్ ఫ్రాన్సిస్ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు విడాకులు కోరుకుంటున్న దంపతుల విషయంలో సానుకూలంగా స్పందించమని ప్రభుత్వానికి సూచించారు. కానీ ఆ దేశ ప్రజలు విడాకులు తీసుకోవడాన్ని అగౌరవంగా భావిస్తుంటారు. అందుకే పోప్ అభ్యర్థనను సైతం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రపంచంలో విడాకులే లేని దేశం తమదని గర్వంగా చెప్పుకోవాలనేదే అక్కడి నేతల కోరిక.
మధ్యలో తెచ్చిన చట్టాలు మధ్యలోనే మాయం!
ఫిలిప్పీన్స్ను మొదట్లో స్పెయిన్ స్వాధీనం చేసుకొని కొన్ని శతాబ్దాలు పాలించింది. ఈ క్రమంలో ఆ దేశ ప్రజలు క్యాథలిక్ క్రైస్తవులుగా మారారు. దీంతో క్యాథలిక్ సంప్రదాయాలు, కట్టుబాట్లు వారిలో జీర్ణించుకుపోయాయి. అందుకే విడాకులు తీసుకోవడాన్ని వారు అగౌరవంగా భావిస్తారు. అధికారికంగా వారు విడిపోలేరు. కాబట్టి ఎవరైనా సరే.. భార్య/భర్త నుంచి విడిపోయి వేరుగా ఉండలేరు. ఒకవేళ ఎవరైనా అలా విడిగా ఉంటే, వారిని నీచంగా చూస్తారు. అయితే, 1898లో స్పానిష్-అమెరికా యుద్ధం జరిగింది. అప్పుడు స్పెయిన్ అధీనంలో ఉన్న ఫిలిప్పీన్స్ అమెరికా హస్తగతమైంది. ఆ తర్వాత అమెరికా పాలకులు ఫిలిప్పీన్స్లో విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టారు. అయితే, విడాకులు తీసుకోవడానికి ఒకే ఒక నిబంధన పెట్టారు. భార్యభర్తల్లో ఎవరో ఒకరు వ్యభిచారం చేస్తున్నట్లు తేలితేనే విడాకులు మంజూరు చేయాలని చట్టం చేశారు.
రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఫిలిప్పీన్స్ను జపాన్ ఆక్రమించింది. అమెరికా చేసిన విడాకుల చట్టాన్ని జపాన్ రద్దు చేసి మరో చట్టం తెచ్చింది. కానీ అది కూడా ఎక్కువ రోజులు అమలులో లేదు. 1944లో తిరిగి అమెరికా ఫిలిప్పీన్స్ను ఆక్రమించుకోవడంతో పాత విడాకుల చట్టాన్నే తిరిగి అమల్లోకి తెచ్చింది. కాగా.. 1946లో అమెరికా నుంచి స్వాతంత్ర్యం పొందిన ఫిలిప్పీన్స్ అమెరికా, జపాన్ చేసిన చట్టాలను తొలగించింది. అసలు తమ దేశ చట్టాల్లో విడాకులన్న పదమే లేకుండా చేసింది. అయితే, ఆ దేశంలోని మైనార్టీ ముస్లింలు మాత్రం తమ మతాన్ని అనుసరించి విడాకులు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం వీలు కల్పించింది.
విడాకుల చట్టం ప్రతిపాదనలు.. విమర్శలు
విడాకులను చట్టబద్ధం చేయడానికి పలుమార్లు విడాకుల ముసాయిదా బిల్లు రూపొందించినా ఇప్పటికీ దానికి చట్టసభల్లో ఆమోదముద్ర పడలేదు. కొన్ని నెలల కిందట రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లును జనాభా, కుటుంబ సంబంధాలశాఖ కమిటీ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని దాని రూపకర్తలు చెబుతున్నారు. దీనికి చట్టసభల్లోనూ ఆమోదం లభించాలని కాంక్షిస్తున్నారు. మరోవైపు క్యాథలిక్ పద్ధతులను అనుసరించే పాలకులు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఆమోదిస్తే వివాహం, కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని అంటున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు పెనుశాపంగా నోటి క్యాన్సర్
నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. -
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
కర్ణాటకలో కలకలం రేపుతున్న ప్రజ్వల్ రేవణ్న లైగింక వేధింపుల కేసులో ‘సిట్’ దర్యాప్తు దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధాన నిందితుడు, హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్న కోసం ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. -
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త
భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. -
ముందు రాయ్బరేలీలో గెలవండి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదట రాయ్బరేలీలో గెలవాలంటూ చెస్ దిగ్గజం కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. -
ఆగ్రాలో ఆలస్యంగా వచ్చిన టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన టీచరును ప్రిన్సిపల్ కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరం
మైనర్లను ఉపయోగించుకుంటూ చేసే అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాల సంఖ్య పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాటిని అరికట్టడానికి బాలల నేర న్యాయవ్యవస్థలకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
వాయుసేన వాహనశ్రేణిపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శనివారమిక్కడి పూంఛ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. -
లోక్సభ ఎన్నికల పరిశీలనకు విదేశీ అతిథులు
ప్రస్తుతం భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆస్ట్రేలియా, రష్యా, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణ సంస్థల ప్రతినిధులు భారత్ చేరుకున్నారు. -
360 మంది అభ్యర్థులపై కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో పోటీచేస్తున్న 1,710 మంది అభ్యర్థుల్లో 360 మంది నేరచరితులని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్) నివేదిక పేర్కొంది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు
ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసింది. -
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తాం
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. -
నిద్రమత్తులో స్టేషన్ మాస్టర్.. పదేపదే హారన్ మోతతో మెలకువ
రైల్వేస్టేషన్ మాస్టర్ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. -
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
స్కూల్కు ఆలస్యంగా వచ్చినందుకు ప్రిన్సిపల్ ఓ టీచర్ను కొట్టిన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. -
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఓ ఎక్స్ప్రెస్ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు