ఫ్యాషన్ డిజైనర్ శర్బారీదత్తా కన్నుమూత
ప్రముఖ బెంగాలీ ఫ్యాషన్ డిజైనర్ శర్బారీదత్తా (63) గుండెపోటుతో మృతిచెందారు. గురువారం రాత్రి బాత్రూమ్లో ఆమె కుప్పకూలిపోయారు. శర్బారీ
కోల్కతా: ప్రముఖ బెంగాలీ ఫ్యాషన్ డిజైనర్ శర్బారీదత్తా (63) గుండెపోటుతో మృతిచెందారు. గురువారం రాత్రి బాత్రూమ్లో ఆమె కుప్పకూలిపోయారు. శర్బారీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని బ్రాడ్ స్ట్రీట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఈరోజు ఉదయం కుమారుడు అమాలిన్ దత్తా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆయన తల్లి ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె బాత్రూమ్లో విగతజీవిగా కనిపించారు. అమాలిన్ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తేల్చారు.
బెంగాలీ రచయిత అజిత్ దత్తా కుమార్తె శర్బారీదత్తా. బెంగాలీ సంస్కృతికి అద్దంపట్టేలా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ పేరు గడించారు. బెంగాలీ చిత్రసీమలోని ఎంతోమంది నటులకు ఆమె ఫ్యాషన్ డిజైనర్గా పనిచేశారు. ఈ దుర్ఘటనతో చిత్రసీమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజ్ చక్రవర్తి, అరిందమ్ సిల్ సహా పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దావత్ కావాలా నాయనా!
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.