Andhra News: రోశయ్య అంటే జగన్‌రెడ్డికి ఎందుకంత కక్ష?: ఆర్యవైశ్య ఐకాస

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టాలని ఏపీ ఆర్యవైశ్య ఐకాస కోరింది. అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టకపోవడం తీవ్రమైన

Published : 09 Mar 2022 01:20 IST

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టాలని ఏపీ ఆర్యవైశ్య ఐకాస కోరింది. అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టకపోవడం తీవ్రమైన అవమానంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. సంతాపం విషయంలోనూ సీఎం జగన్‌ కులం చూస్తున్నారని విమర్శించారు. రోశయ్య అంటే జగన్‌రెడ్డికి ఎందుకంత కక్ష? అని ఐకాస నేతలు ప్రశ్నించారు. రోశయ్యకు సంతాప తీర్మానం పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, పలుమార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య 2021 డిసెంబరు 4న హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని