Bed Rotting: ఏమిటీ ‘బెడ్ రాటింగ్’.. ఎందుకంత ట్రెండ్ అవుతోంది..?
సుదీర్ఘ సమయంపాటు బెడ్కు అంకితమయ్యే ‘బెడ్ రాటింగ్’కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అలసటగా అనిపించిన.. ఓపిక లేకపోయిన.. తదితర సందర్భాల్లో ఎక్కువ సేపు మంచంపైనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇది సహజంగా జరిగేదే. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో (Generation Z) ఇదో కొత్త పేరుతో ట్రెండ్ అవుతోంది. అదే బెడ్ రాటింగ్ (Bed Rotting). అంటే.. సుదీర్ఘ సమయం పాటు పడకకే అంకితం అవడమన్నమాట. తాజాగా ఇదే పేరుతో వస్తోన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. ఇంతవరకు ఎలాగున్నా.. ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడంలో (Self Care) భాగంగా ఒక దశవరకు భౌతిక, మానసిక ప్రశాంతతకు ఇదెంతో ఉత్తమ మార్గమని కొంతమంది నిపుణులు కూడా సూచిస్తుండటం గమనార్హం.
అమెరికాకు చెందిన ఓ టిక్టాకర్ తొలుత ఈ పదాన్ని ఉపయోగిస్తూ.. ‘ఇలా బెడ్కు అంకితం అవడం ఎవరికి ఇష్టం’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో వైరల్గా మారడంతోపాటు ఎంతోమంది ఆమెకు మద్దతుగా కామెంట్లు పెట్టారు. ఇప్పటివరకు సుమారు కోటిన్నర మంది వీక్షించారు. మరో యువతి పెట్టిన టిక్టాక్ పోస్టును మూడు కోట్లకుపైగా చూశారు. ఇదే తరహాలో అనేక వీడియోలు ఇటీవల టిక్టాక్ వంటి వీడియో మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ (Health Care) కోసం నేటి యువత ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారట.
సుదీర్ఘ సమయంపాటు బెడ్మీద పడుకోవడమే ‘బెడ్ రాటింగ్’ అర్థం. సాధారణం కంటే ఎంత ఎక్కువ సేపు మంచానికే పరిమితం అవుతున్నారనేదే దీని భావం. ఎందుకు అంతసేపు ఉంటున్నారు..? ఆ సమయంలో ఏం చేస్తున్నారనేది ముఖ్యం కాదు. కొంతమంది ఓటీటీలు చూడటం, సీలింగ్ను చూస్తూ ఉండిపోవడం, యోగా చేయడం చేస్తుంటే.. మరికొందరు నిద్రపోవడం చేస్తున్నారు. అయితే, బెడ్ రాటింగ్ మాదిరిగానే ఇటీవల ఎన్నో చేష్టలు ట్రెండింగ్గా మారాయి. ‘బాడీ చెకింగ్’, ‘వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే’ వంటి పేర్లతో పలు వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
ప్రయాణికుల రద్దీతో 22 రైళ్లకు అదనపు కోచ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటుచేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి చెందిన మాల్కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. -
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఏపీ సీఎం జగన్ (YS Jagan) దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నోటా.. వచ్చిందిలా
ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం లేకపోవడం వల్ల రకరకాల పద్ధతుల్లో గతంలో తమ వ్యతిరేకతను తెలిపేవారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
ఓట్ల పండగకు ఆహ్వానం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM