Ice cubes: కరిగిపోయే సీతాకోకచిలుక..!
మారుతున్న టెక్నాలజీ పరిజ్ఞానం, విస్తరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను
ఇంటర్నెట్ డెస్క్: మారుతున్న టెక్నాలజీ పరిజ్ఞానం, విస్తరిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటూ ఈ రోజుల్లో రెస్టారెంట్లను నడపడం అంత సులువేం కాదు. ఎప్పటికప్పుడు రెస్టారెంట్లు వాటి వ్యూహాల్ని మార్చుకుంటూ ఆహార ప్రియుల్ని ఆకట్టుకోవాలి. రుచికరమైన ఆహారాన్ని అందించడం మాత్రమే కాదు. ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకునే విధంగానూ వాటిని ప్రదర్శించాలి. వినూత్న ఆలోచనలతో సరికొత్త మార్గాలను అనుసరించాలి. ఇదే తరహాలో ఆకర్షణీయంగా తయారుచేసిన డ్రింక్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీతాకోకచిలుక ఆకారంలోని ఐస్ ముక్కలను (క్యూబ్స్) జోడించి తయారుచేసిన ఆ డ్రింక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. @blestallure అనే పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో ఆ ఫొటో పొందుపరిచారు. ఇప్పటికే ఈ ఫొటోకు 2 లక్షలకు పైగా లైక్స్, 40వేల రీట్వీట్లు వచ్చాయి. ఈ ఫొటోలో సాధారణ ఐస్ ముక్కలను కలిపిన రెండు వేర్వేరు రంగులతో కూడిన (ఒకటి రోజ్ ఫ్లెవర్డ్, మరొకటి గ్రీన్ మట్చా టీ) పానీయాలు ఉంటాయి. వీటిలో సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న ఐస్ ముక్కలను చేర్చడంతో ఆ డ్రింక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్ యూజర్స్ ఈ ఫొటోను చూడగానే మంత్ర ముగ్ధులవుతున్నారు. మరికొంత మంది ఇటువంటి డ్రింక్ ఎక్కడ దొరుకుతుందో చెప్పమని షేర్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ