Mystery House On Moon: చంద్రుడిపై ఓ ‘మిస్టరీ హౌస్’?
చంద్రుడి ఉపరితలంపై ఓ వింత వస్తువు కనిపిస్తోందంటూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది....
ఇంటర్నెట్ డెస్క్: చంద్రుడి ఉపరితలంపై ఓ వింత వస్తువు కనిపిస్తోందన్న వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చైనా 2019లో చంద్రుడిపైకి పంపిన ‘యుటు-2’ అనే రోవర్ ఇటీవల కొన్ని చిత్రాలు పంపింది. అందులో ఘనాకారంలో ఉన్న ఓ వస్తువు కనిపించినట్లు ఆండ్రూ జోన్స్ అనే స్పేస్ జర్నలిస్ట్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికి దీన్ని ‘మిస్టరీ హౌస్’గా వ్యవహరిస్తుండడం గమనార్హం.
యుటు-2 రోవర్ ‘వోన్ కార్మన్’ అనే క్రేటర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ దృశ్యం కనిపించినట్లు ఆండ్రూ పేర్కొన్నారు. ప్రస్తుతం అది రోవర్కు 80 మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అయితే, అది స్తంభమో లేక ఏలియనో కాదని పేర్కొన్నారు. మరైతే అది ఏంటనేది మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో 2-3 ‘ల్యూనార్ డేస్’(దాదాపు 2-3 నెలలు)లో రోవర్ అక్కడికి చేరుకుంటుందని తెలిపారు. ఉల్కలు, గ్రహశకలాలు చంద్రుడిని ఢీకొట్టినప్పుడు పెద్ద పెద్ద రాళ్లు బయటపడుతుంటాయన్నారు. చైనా పంపిన ఛాంగ్ ఇ-3 మిషన్లోనూ ఇలాంటిది కనిపించినట్లు తెలిపారు. కానీ, అది ఓ పెద్ద బండరాయని తర్వాత తెలిసిందన్నారు.
ఇలా చంద్రుడికి సంబంధించి రోవర్లు పంపే చిత్రాల్లో ఏదో వింత ఆకారాలు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో యుటు-2 పంపిన ఫొటోల్లో ఆకుపచ్చ రంగులో జెల్ లాంటి పదార్థం ఒకటి కనిపించింది. తర్వాత జరిపిన పరిశోధనల్లో దాన్ని రాయిగా నిర్ధారించారు. ఇటీవల ఓ పెద్ద మేకు లాంటి ఆకారం కూడా కనిపించింది. అది కూడా రాయే అని తేలింది. ఆండ్రూ జేమ్స్.. చైనా అంతరిక్ష కార్యకలాపాల్ని రిపోర్ట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన స్పేస్.కామ్ అనే వార్తా సంస్థకు పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్