CM Jagan: రేపు దిల్లీకి ఏపీ సీఎం జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు దిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated : 01 Jun 2022 16:20 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేపు దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సహా పలువురు మంత్రులను సీఎం కలిసే అవకాశముంది. దావోస్‌ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు, రాష్ట్రపతి ఎన్నికలపైనా చర్చించే అవకాశముందని తెలుస్తోంది.  రేపు ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు దిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు 1 జనపథ్‌ చేరుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని